Animal: ‘యానిమల్‌’.. వాటి గురించి మాత్రమే మాట్లాడతాను: కరణ్ జోహార్‌

ఒక దర్శకుడిగా ‘యానిమల్‌’ తనకెంతో నచ్చిందని కరణ్‌జోహార్‌ అన్నారు.

Published : 12 Mar 2024 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా నటించిన ‘యానిమల్‌’ సినిమా విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు వారి అభిప్రాయాన్ని తెలియచేశారు. తాజాగా బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్‌జోహార్ (Karan Johar) తన రివ్యూ ఇచ్చారు.

‘ఈ సినిమాపై ఎంతోమంది విమర్శలు కురిపించారు. కానీ, దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. సినిమాను వినోదం కోసం మాత్రమే చూడాలి. నేను ‘యానిమల్‌’ను అలాగే చూశా. నాకెంతో నచ్చింది. సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగులు, కథను చూపించిన విధానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. వీటి గురించే మాట్లాడతాను కానీ, సినిమా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది. నైతిక విలువల గురించి మాట్లాడను. ఇలా చెప్పినందుకు నాతో ఎవరు ఏకీభవించినా, లేకపోయినా నేను ఈ సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఒక దర్శకుడిగా ఈ చిత్రం నాకెంతో నచ్చింది’ అని చెప్పారు. తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘యానిమల్‌’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనూ భారీ వ్యూస్‌తో రికార్డు సృష్టిచింది.

‘గామి’కు కావాలనే తక్కువ రేటింగ్.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ విశ్వక్ పోస్ట్

ఇక త్వరలోనే ఈ సినిమా సీక్వెల్‌ రానుంది. ‘యానిమల్‌ పార్క్‌’ పేరుతో ఇది తెరకెక్కనుంది. ఇటీవల దీని గురించి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘ఇందులో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యం. ఊహించనన్ని యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. రణ్‌బీర్‌ కపూర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని