Khushi Kapoor: హిట్‌ సినిమా రీమేక్‌లో ఖుషీ కపూర్‌.. తెలుగులోనూ బిజీ కానుందా!

ఖుషీ కపూర్‌ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 15 Mar 2024 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దివంగత నటి శ్రీదేవి కుమార్తెలు ఇండస్ట్రీలో బిజీ కానున్నారు. ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఖుషీ కపూర్‌ (Khushi Kapoor) కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కుమారుల సినిమాల్లో ఖుషీ నటించనున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న ‘నాదనియాన్‌’ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలుగులోనూ రానున్నట్లు సమాచారం. అలాగే, ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జువైద్‌ ఖాన్‌తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన ‘లవ్‌టుడే’ను బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో జువైద్‌ సరసన ఖుషీ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రదీప్‌ రంగనాథన్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ హిట్టైంది. దీంతో హిందీలో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు.

మమ్మల్ని అర్థం చేసుకోండి.. ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడి పోస్ట్‌

తాజాగా  ‘ది ఆర్చిస్‌’ (The Archies) చిత్రంతో పలకరించారు ఖుషీ. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైన ఈ సినిమాలో బీటౌన్‌ అగ్రతారల వారసులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇక జాన్వీ కపూర్‌ విషయానికొస్తే.. తెలుగులో ఇద్దరు స్టార్‌ హీరోల సరసన నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా వస్తోన్న ‘దేవర’, రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమాలోనూ హీరోయిన్‌గా అలరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని