ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే.. ఆసక్తిగా ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ ట్రైలర్‌

‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు వెంకటేశ్‌ విడుదల చేశారు. ఈ చిత్రం నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 05 Nov 2022 01:42 IST

హైదరాబాద్‌: ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. మధునందన్‌ కీలక పాత్ర పోషించారు. గురుపవన్‌ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు వెంకటేశ్‌ శుక్రవారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫిబ్రవరి 13.. నా లైఫ్‌లో నేను మర్చిపోలేని రోజు’ అని హీరో తన కథ గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన యువకుడు ఆ అమ్మాయిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రం నవంవరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ట్రైలర్‌ విడుదల సందర్భంగా ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘వెంకటేశ్‌గారు మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఒక్క రోజులో సాగే కథ ఇది. యువతను బాగా ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు హీరోయిన్‌ జెన్నీఫర్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని