కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ చిత్ర బృందం

ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. జెన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌ కథానాయిక.

Published : 02 Nov 2022 15:58 IST

విజయవాడ: ఉదయ్‌ శంకర్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. జెన్నీఫర్‌ ఇమ్మానుయేల్‌ కథానాయిక. మధునందన్‌ కీలక పాత్ర పోషించారు. గురుపవన్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ, విశాఖల్లో చిత్ర బృందం పర్యటిస్తోంది. తాజాగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లి చిత్ర బృందం అమ్మవారి ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిత్ర బృందానికి ఆశీర్వాచనం చేసి, అమ్మవారి ప్రసాదం అందించారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కథానాయకుడు ఉదయ్ శంకర్‌ మాట్లాడుతూ.. వాణిజ్య ప్రధానం సాగే థ్రిల్లర్‌ చిత్రమని, యువతతో పాటు, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని అన్నారు. ఇక వైజాగ్‌లోనూ ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండూ’ చిత్ర బృందం సందడి చేసింది. అక్కడి సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌కు వెళ్లి, యువతను పలకరించింది. వారితో కలిసి ఫొటోలు దిగింది. ఈ చిత్రానికి అట్లూరి నారాయణరావు నిర్మాత. అట్లూరి ఆర్‌.సౌజన్య సమర్పకులు. సుమన్‌, పృథ్వీరాజ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గాయత్రి భార్గవి, కల్యాణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని