naga chaitanya: హైదరాబాద్‌లో ‘థ్యాంక్‌ యూ’

‘థ్యాంక్‌ యూ’ చిత్రాన్ని ముగించేందుకు కథా నాయకుడు నాగ చైతన్య సిద్ధమవుతున్నారు. ఇందుకోసం

Updated : 29 Jun 2021 10:03 IST

హైదరాబాద్‌: ‘థ్యాంక్‌ యూ’ చిత్రాన్ని ముగించేందుకు కథా నాయకుడు నాగ చైతన్య సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జులై తొలి వారంలోనే తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. విక్రమ్‌.కె.కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొత్తదనం నిండిన ఓ వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతోంది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్‌ కథానాయికలు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కరోనా ఉద్ధృతిలోనే ధైర్యంగా ఇటలీలో కీలక షెడ్యూల్‌ పూర్తి చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఆఖరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ వారాంతంలోనే ఈ షూట్‌ మొదలు కానుంది. ప్రస్తుతం మరో ఐదు రోజుల చిత్రీకరణే మిగిలి ఉందని.. ఇందులో భాగంగా చైతూతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. సినిమా విడుదలపై ఆగస్టులో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు