Naresh Pavitra: మా బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది: నరేశ్
‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli) ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటుడు నరేశ్ (Naresh), నటి పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh). తాజాగా వీరిద్దరూ ఈటీవీతో సరదాగా ముచ్చటించారు.
హైదరాబాద్: ‘మళ్ళీ పెళ్లి’ (Malli pelli)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు నరేశ్ (Naresh), నటి పవిత్రా లోకేశ్ (Pavitra Lokesh). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించారు. మరికొన్ని రోజుల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో నరేశ్ - పవిత్ర తాజాగా ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘మళ్ళీ పెళ్లి’ కేవలం నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తెరకెక్కించిన సినిమా కాదు. సమాజంలోని పరిస్థితులు, ఎంతోమంది ఆలోచనలను ఆధారంగా చేసుకుని దీన్ని తీర్చిదిద్దాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్ల వివాహ వ్యవస్థ ఈ మధ్యకాలంలో దెబ్బతింటోంది. వైవాహిక బంధంపై మాకున్న గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. ఇదొక బోల్డ్ ఐడియా. సెన్సార్ బృందంతోపాటు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కు ఈ చిత్రాన్ని చూపించాం. అందరూ మెచ్చుకున్నారు. యూత్ కూడా మా సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది’’
‘‘సోషల్మీడియాలో మాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే నేను ఈ సినిమా చేశానని అన్నారు. ఎవరి ఉద్దేశాలు వాళ్లకు ఉంటాయి. వాటిని మేము తప్పుబట్టడం లేదు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్ వేదికగా వాళ్లను విమర్శిస్తూ వీడియోలు షేర్ చేయవచ్చు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు’’ అని నరేశ్ తెలిపారు.
అనంతరం ‘మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా?’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘ఉదాహరణకు మనం ప్రేమగా ఒక ఇల్లు కట్టుకున్నాం. దురదృష్టవశాత్తు భూకంపానికి అది కూలిపోయింది. మళ్లీ ఇల్లు కట్టుకుంటామా? లేదా? అలాగే.. నా జీవితం కూలిపోయింది. తన లైఫ్ కూలిపోయింది. అది మేము ఎవరికీ చెప్పలేదు. అది చెప్పినప్పుడే సమస్యలు మొదలయ్యాయి. చెప్పకపోతే ఏమీ ఉండేది కాదు. వైవాహిక బంధానికి, మానవ హక్కులకు విలువ ఇస్తూ ఏ వ్యక్తి ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు అని కోర్టు తీర్పు నిచ్చింది. నా సినిమాలు నేను చేసుకుంటూ నా తోడుని వెతుక్కున్నా. లివ్ ఇన్ రిలేషన్ కొత్తదేమీ కాదు. కోర్టే దానికి అంగీకారం తెలిపింది. పెళ్లి అంటే యూనియన్ ఆఫ్ హార్ట్స్. మా మనసులు ఎప్పుడో కలిశాయి. మాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే తప్పకుండా అందర్నీ పిలిచి ఘనంగా చేసుకుంటాం’’ అని నరేశ్ వివరించారు.
ఇక, ఇదే ఇంటర్వ్యూలో ట్రోల్స్ గురించి నరేశ్ స్పందించారు. ‘‘ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లయ్ చేశాను. ఆ తర్వాత నుంచి నా పరువుకు భంగం కలిగించాలని, మా బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. ఇలా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెను నేను కాపాడాలి. అందుకే ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటున్నాను. మా కుటుంబం కూడా మాకు అండగా ఉంది’’ అని అన్నారు.
‘‘సినిమా షూటింగ్లో మా ఇద్దరికీ పరిచయమైంది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. విషయం ఏదైనా పాజిటివ్గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు’’ అని పవిత్ర వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.