Naveen Polishetty: ఇంటిపేరు పాడుచేస్తున్నా అని తిట్టారు: నవీన్‌ పొలిశెట్టి

అనుష్క (Anushka) - నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. మహేశ్‌బాబు దర్శకుడు. సెప్టెంబర్‌ 7న ఇది విడుదల కానుంది.

Published : 16 Aug 2023 18:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంటి పేరుని పాడుచేస్తున్నానంటూ గతంలో తనని ఇంట్లోవాళ్లు తిట్టారని నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) తెలిపారు.  ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో తన జీవితం మారిందని, ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ పోస్టర్‌పై ఇంటిపేరు చూసి తన తండ్రి ఎంతో ఆనందించారని చెప్పారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘నేనొక ఇంజినీర్‌. ఉద్యోగం పక్కనపెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టా. మంచి సంపాదన వదిలేసి సినిమా పరిశ్రమలోకి వచ్చానని నా తల్లిదండ్రులు ఎంతో కోప్పడ్డారు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’కు ముందు దాదాపు పదేళ్లపాటు ఇంటి పేరు పాడుచేస్తున్నానంటూ తిట్టారు. ఇప్పుడు నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు సినిమా టైటిల్‌లో మా ఇంటి పేరు ఉండటం చూసి నాన్న ఎంతో ఆనందించారు’’

‘వాళ్లు ఈ విషయాన్ని గ్రహించాలి’.. సోనమ్‌ ఇన్‌స్టా పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి..?

‘‘జాతిరత్నాలు’ ఆ స్థాయిలో ఆదరణ అందుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఒత్తిడికి లోనయ్యా. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక మహిళా అభిమానిని కలిశా. కాలిన గాయాలతో ఉన్న ఆమె నన్ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. నాకూ కన్నీళ్లు వచ్చేశాయి. ఆమె నన్ను ఎంతలా అభిమానిస్తున్నారో తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యా. నన్ను ఇంతలా ఆదరిస్తున్న వాళ్లకు మంచి వినోదాన్ని అందించాలని ఫిక్స్‌ అయ్యా. ఎన్నో కథలు విన్నా. ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ నాకెంతో నచ్చింది. అందుకే, ఈసినిమా ఓకే చేశా. హీరోయిన్‌గా అనుష్కను ఎంచుకున్నారని తెలిసి మొదట ఆశ్చర్యపోయా. ఆమెతో కలిసి వర్క్‌ చేయడం సరదాగా అనిపించింది’’ అని నవీన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని