బాహుబలి: ది బిగినింగ్‌కు ఆరేళ్లు!

2015లో వచ్చిన ‘బాహుబలి’ ఆ సరిహద్దులను చెరిపేసింది

Published : 10 Jul 2021 15:02 IST

ఇన్‌స్టాలో ఆనందాన్ని పంచుకున్న ప్రభాస్‌

అప్పటి వరకు తెలుగు సినిమా అంటే కేవలం భారతదేశం వరకే పరిమితం. 2015లో వచ్చిన ‘బాహుబలి’ ఆ సరిహద్దులను చెరిపేసింది. తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించారు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జులై 10న విడుదలై... ఈరోజుతో ఆరేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ప్రభాస్‌.. ‘బాహుబలి’తో తన అనుబంధాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘‘ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సినిమారంగంలో మాయాజాల తరంగాలను సృష్టించింది’’ అంటూ ఆ చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు.

ప్రభాస్‌ పోస్టును నటులు రానా, అనుష్క, తమన్నా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టి బహుబలిని గుర్తుచేసుకున్నారు. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌, శివగామిగా రమ్యకృష్ణ ఆ చిత్రానికి ప్రాణం పోశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. జాతీయ ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగానికి ఉత్తమ పురస్కారం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా నిలవడం మరో విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని