Rashmika Mandanna: రష్మికకు అరుదైన ఘనత.. ఫోర్బ్స్‌ జాబితాలో శ్రీవల్లి..!

‘పుష్ప’లో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన అండర్‌ 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది.

Published : 15 Feb 2024 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగుతో పాటు, హిందీలోనూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక (Rashmika) మరో అరుదైన ఘనతను సాధించింది. తాజాగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఏటా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేస్తుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజసేవ, ఇంధనం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ ఇలా పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత చెప్పింది. ఇటీవల ‘యానిమల్‌’ విజయంలో భాగస్వామి అయిన ఆమె ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో పాల్గొంటోంది. అల్లు అర్జున్‌ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి సుకుమార్‌ దర్శకుడు.

ఇక ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాను పరిశీలిస్తే,  అగ్రి బయో టెక్నాలజీ సహ వ్యవస్థాపకులు అంకిత్‌ అలోక్‌ బగారియా, అభిగావ్రి.. విరాజ్‌ ఖన్నా (నటుడు), శ్రేయాన్స్‌ చోప్రా (సీఈవో మస్టాక్‌) ప్రిహా బిస్వాస్‌ (సీపీవో ఆగ్నిటో), అజింక్య ధారియా (ప్యాడ్‌ కేర్‌ ల్యాబ్స్‌),  అనుపమ్‌ కుమార్‌, అర్వింద్‌ భరద్వాజ్‌ (మినీ మైన్స్‌ సహ వ్యవస్థాపకులు), నవజీత్‌ ఖర్కేరా, జగత్‌ బిడ్డప్ప (రాప్చర్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌ సహ వ్యవస్థాపకులు), అభిషేక్‌ ధురానీ, నేత్రా అజంపూర్‌ (క్రియేటివ్‌ ఏజెన్సీ స్టూడియో సార్టెడ్‌ సహ వ్యవస్థాపకులు), క్రిస్టోఫర్‌ రిచర్డ్‌ (స్టూడియో కార్బన్‌), అనుష్క రాఠోడ్‌ (డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌), దీప్‌రాజ్‌ జాదవ్‌ (డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌), ఆదిత్‌ పలీచా, కైవల్య వోహ్రో (జెప్టో సహ వ్యవస్థాపకులు), వరుణ్‌ సంఘీ (కార్ ట్రేడ్‌ వెంచర్స్‌), అనుపమ్‌ పెదార్ల, శశాంక్‌ రెడ్డి గుజ్జుల, రాహుల్‌ అట్లూరి (నెక్ట్స్‌ వేవ్‌ టెక్నాలజీస్‌), ఉద్ధవ్‌ కుమార్‌ (లింకిట్‌ సీఈవో), రాధికా మదన్‌ (నటి), విశేష్‌ ఖన్నా (ఏకే-ఓకే సహ వ్యవస్థాపకుడు), విశాల్‌ తొలంబియా (హ్యూమానిటీ సెంటర్డ్‌ డిజైన్స్‌ సీఈవో), సీతా లక్ష్మీ నారాయణ్‌ (ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), విష్ణు ఆచార్య (రాజర్‌పే, స్ట్రాటజీ హెడ్‌), అభిషేక్ అగర్వాల్‌ (ఫార్మ్‌లీ డైరెక్టర్‌), డాక్టర్‌ నదీమ్‌ అహ్మద్‌ (మెకన్సే అండ్‌ కంపెనీ సీనియర్‌ కన్సల్టెంట్‌), ఆర్యన్‌ చౌహాన్‌ (జీవోవ్‌ సహ వ్యవస్థాపకుడు), రామకృష్ణ మెందు, చిరాగ్‌ జైన్‌ (ఎండ్యూర్‌ ఎయిర్‌ సిస్టమ్స్‌ సీఈవో, సీటీవో) అదిత్‌ సైగల్‌ (నటి, సంగీతకారిణి), హన్నీ భగచందానీ (టార్చిట్‌ వ్యవస్థాపకుడు), పరుల్‌ చౌదరి (అథ్లెట్‌), సుమిత్‌ అంతిల్‌ (పారా అథ్లెట్‌), జ్యోతి యారాజీ (అథ్లెట్)లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని