Rashmika: అలా పిలవాల్సిన సమయం వచ్చింది: రష్మిక

ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే సినీ రంగం ముఖ్య ఉద్దేశమని రష్మిక అన్నారు.

Published : 05 Mar 2024 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కథానాయిక రష్మిక (Rashmika Mandanna). గతేడాది ‘యానిమల్‌’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె తాజాగా తన 22వ చిత్రం షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మంచి సినిమాలను మాత్రమే ఎంచుకుంటానన్నారు. ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

నార్త్‌ వర్సెస్‌ సౌత్‌ అంశంపై స్పందిస్తూ.. ‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే సినీరంగం ముఖ్య ఉద్దేశం. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అని అనడం కంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమ అని పిలిస్తే బాగుంటుంది. ఇప్పుడు అలా పిలిచే సమయం వచ్చింది. మనమందరం గొప్ప కథలను ప్రేక్షకులకు అందించడానికి ఈ రంగాన్ని ఎంచుకున్నాం. అలాంటప్పుడు హద్దులు పెట్టకూడదు. ఒక సినిమా కోసం వివిధ భాషలకు చెందినవారు కలిసి పనిచేస్తారు. ఇది స్వాగతించాల్సిన విషయం. నేనూ ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’ అన్నారు. ఇక ‘పుష్ప2’ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సుకుమార్‌ ప్రతీ సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆడియన్స్‌కు గొప్ప అనుభూతినిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని చెప్పారు.

వాళ్ల కెరీర్ కోసమే మాట్లాడడం తగ్గించేశా: నటి జీవిత

2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. దీనికోసం బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని