14 ఏళ్ల ‘మున్నా’.. కీర్తి సురేశ్‌ సంతోషం

ప్రభాస్‌ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మున్నా’ చిత్రం 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘14 సంవత్సరాల క్రితం నా తొలి చిత్రం విడుదలైంది. మున్నా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని ఈ సందర్భంగా తెలియజేశారు వంశీ.

Published : 03 May 2021 01:15 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన సోదరి రేవతి సురేశ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు నాయిక కీర్తి సురేశ్‌. ‘మరక్కర్‌’ సెట్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారామె. మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

* 1980లో వరల్డ్‌ టూర్‌కి వెళ్లారు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. ఈఫిల్‌ టవర్‌ (పారిస్‌) వద్ద దిగిన ఇళయరాజా ఫొటోని ఆయన తనయుడు, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

* ప్రభాస్‌ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మున్నా’ చిత్రం 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ‘14 సంవత్సరాల క్రితం నా తొలి చిత్రం విడుదలైంది. మున్నా ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’ అని ఈ సందర్భంగా తెలియజేశారు వంశీ.

* భౌతిక దూరం పాటించండి.. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి అంటూ ఓ ఫొటోని షేర్‌ చేశారు యువ నటుడు శ్రీ విష్ణు.
 


 




















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని