Dil Raju: ఆ వార్తలు అవాస్తవం.. ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆలోచనలేదన్న దిల్‌రాజు నిర్మాణ సంస్థ

Dil Raju: ఓటీటీ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తోసిపుచ్చింది.

Published : 06 Nov 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదిక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను దిల్‌ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఖండించింది. నిర్ధారణ కాకుండా వార్తలను ప్రచురించవద్దని కోరింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.

‘‘మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు’’ అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొంది. రూ.5కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని యోచిస్తున్నట్టు టాక్‌ వినిపించింది. ఇది 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని,  ఒకవేళ ఇదే నిజమైతే ఆయన నిర్మించే సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాలు కూడా అందులోనే విడుదలయ్యే అవకాశముందని కథనాలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని