Tamannaah: తమన్నా 19 ఏళ్ల సినీ కెరీర్‌.. అభిమానులకు హామీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

తమన్నా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయింది.

Published : 04 Mar 2024 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి తమన్నా. ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు పూర్తయింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్‌  శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు ఎడిట్‌ చేసిన తమన్నా పోస్టర్లను షేర్‌ చేశారు. దీనికి తమన్నా రిప్లై ఇచ్చారు.

‘థాంక్యూ కాజు. ఇన్ని సంవత్సరాల నుంచి నాకెంతో మద్దతుగా నిలిచావు. హద్దులు లేనిప్రేమను పంచావు. నీ లాంటి స్నేహితురాలు ఉండడం వల్లే నా కెరీర్‌ హాయిగా కొనసాగుతోంది. అభిమానుల అద్భుతమైన అంకితభావం, వాళ్ల ఉత్సాహం నాకు రెట్టింపు శక్తినిస్తాయి. మీ అందరికీ నచ్చే చిత్రాలను అందిస్తానని హామీ ఇస్తున్నా. రానున్న సంవత్సరాలు ప్రేమతో నిండిన లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందిస్తాయని ఆశిస్తున్నా’ అని రిప్లై ఇచ్చారు.

శివరాత్రి స్పెషల్‌.. ఈవారం అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే

తమన్నా 2005లో హిందీ సినిమా ‘చాంద్‌ సా రోషన్‌ చెహ్రా’తో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అదే ఏడాది ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘ఓదెల 2’లో తమన్నా ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. అశోక్‌తేజ దర్శకుడు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని