Akhanda: అభిమానుల్ని ఎలా రెచ్చగొట్టాలో బోయపాటికి బాగా తెలుసు: బాలకృష్ణ

దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’. ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయిక.

Published : 09 Dec 2021 23:47 IST

విశాఖపట్నం: దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’. ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, జగపతిబాబు, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. అమెరికా, ఆంధ్రా అనే తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘విజయోత్సవ జాతర’ను నిర్వహించింది. విశాఖపట్నం వేదికగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకనిర్మాతలు, నటులు పాల్గొన్నారు.

వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘హ్యాట్రిక్‌ అంటే మాకే కాదు అందరిలోనూ కాస్త భయం ఉంటుంది. అయితే మేం ఎప్పుడూ ఒక చిత్రానికి పనిచేస్తుంటే గత చిత్రం గురించి ఆలోచించలేదు. ‘అఖండ’ చేసేటప్పుడు ‘లెజెండ్‌’ గురించి, ‘లెజెండ్‌’కి పనిచేసే సమయంలో ‘సింహా’ గురించి మాట్లాడుకోలేదు. నాకూ బోయపాటి శ్రీనుకి సయోధ్య ఉంది. ఆయన ఏ సినిమా కథా నాకు పూర్తిగా చెప్పలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే వివరించేవారు. బాగా నచ్చడంతో ప్రాజెక్టుకు ఓకే చెప్పేవాడ్ని. మా మధ్య ఎక్కువగా చర్చలు జరగవు. అభిమానుల్ని ఎలా రెచ్చగొట్టాలో.. వారితో థియేటర్లలో ఎలా రచ్చ చేయించాలో ఆయను బాగా తెలుసు. ‘అఖండ’ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది కేవలం మా విజయమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం’ అని అన్నారు.

Read latest Cinema News and Telugu News






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని