Love Story: ‘ఫిదా’కి తిరస్కరించారు.. ‘లవ్స్టోరి’కి అవకాశం ఇచ్చారు
‘లవ్స్టోరి’ సంగీత దర్శకుడు పవన్ ఇంటర్వ్యూ. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: ‘సారంగ దరియా’, ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి’ తదితర గీతాలతో శ్రోతల్ని ఓలలాడిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు పవన్ సి.హెచ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ దగ్గర పనిచేసిన ఈయన ‘లవ్స్టోరి’ చిత్రంతో టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రమిది. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సంగీత పవన్ మీడియాతో ముచ్చటించారు. తన సంగీత ప్రయాణం గురించి వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
సంగీతంపై ఆసక్తి అలా మొదలైంది..
చిన్నప్పటి నుంచి సినిమాల్ని విపరీతంగా చూసేవాడ్ని. మా తాత, నాన్న ఇద్దరూ సినిమాటోగ్రాఫర్లు. అయినా నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉండేది కాదు. హైదరాబాద్లో నాకున్న స్నేహితులంతా సంగీత నేపథ్యం ఉన్నవారే. వారితో అప్పుడప్పుడు స్టూడియోలకి వెళ్తుండేవాడ్ని. ఓ పాటకి సంగీతం ఎలా సమకూరుస్తారు? దాన్ని ఎలా రికార్డు చేస్తారు? అని తెలుసుకునే ప్రయత్నంలో సంగీతంపై ఆసక్తి పెరిగింది. సాంకేతికంగా అంతగా ఏం తెలియకపోయినా ఓ ర్యాప్ సాంగ్ రూపొందించి, కుటుంబ సభ్యులకి వినిపించాను. బాగుందని చెప్పి, నన్ను ప్రోత్సహించారు. రెండు సంవత్సరాలు ఇక్కడే కీ బోర్డు నేర్చుకుని, ఆ తర్వాత కె. ఎం. మ్యూజిక్ (చెన్నై) లో చేరాను. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. ఓసారి ‘గాలా నైట్’ కార్యక్రమం కోసం కొన్ని పాటల్ని కంపోజ్ చేశా. అక్కడికి అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్కి నా మ్యూజిక్ నచ్చడంతో ఆయన దగ్గర పనిచేసే అవకాశం ఇచ్చారు. ఆయన సంగీతం అందించిన ‘సచిన్’, ‘సర్కార్’, ‘రోబో’ తదితర చిత్రాలకి పనిచేశా.
పరీక్షించారు..
దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రానికి పనిచేయాలనే ప్రయత్నంలో భాగంగా ‘ఫిదా’కి ఆడిషన్ ఇచ్చా. ఓ ట్యూన్ నచ్చినా, నేను కొత్తవాడ్ని కావడంతో తిరస్కరించారు. ఆయన అంత త్వరగా అవకాశం ఇవ్వరనే సంగతి తెలిసిందే. అలా మరో ప్రయత్నం చేశా. రెహమాన్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ‘హే పిల్లా’ అనే పాటకి సంబంధించిన డెమోని శేఖర్కి పంపించాను. అది విని చాలా బాగుందన్నారు. కానీ, వెంటనే ఓకే చేయలేదు. ఈ ట్యూన్ చేయడానికి ఎంత సమయం పట్టింది? అలా చేయ్... ఇలా చేయ్ అంటూ నన్ను పరీక్షించారు. నా మైండ్సెట్ ఎలా ఉందో తెలుసుకున్నారు. దాన్ని సవాలుగా స్వీకరించా. సుమారు 10 ట్యూన్లు వినిపించా. నా పనితీరు నచ్చడంతో ‘లవ్స్టోరి’ కథ చెప్పారు. సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆయనతో సాగిన ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.
అలా.. ‘సారంగ దరియా’
జానపద గీతం ‘సారంగ దరియా’ని నాకు ఓసారి చూపించారు. కానీ, సినిమాలో పెట్టాలని ముందుగా చెప్పలేదు. తర్వాతి చర్చల్లో దీన్ని మనం రీ క్రియేట్ చేయాలన్నారు. అది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. అయితే ఈ పాటపై వచ్చిన వివాదం గురించి నాకు తెలియదు. నేను ఆ సమయంలో ఈ సినిమా నేపథ్య సంగీతం పనుల్లో చెన్నైలో బిజీగా ఉన్నాను. రొమాంటిక్ కామెడీ చిత్రాలకైతే నేపథ్య సంగీతం ఇవ్వడం తేలికే. కానీ, ఇలాంటి సున్నితమైన ప్రేమకథలకి ఇవ్వడం కొంచెం కష్టమైన పని. ఈ ఆల్బమ్ విన్న రెహమాన్ నేను బాగా చేశానని నా స్నేహితులతో చెప్పారట. ‘హేయ్ పిల్లా’ పాట వినగానే చాలా బాగుందంటూ నాగ చైతన్య నాకు మెసేజ్ చేశారు. అది ఎప్పటికీ మరిచిపోలేను.
శేఖర్ కమ్ములే కారణం..
ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్ అవడానికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నా. ఇంకా ఖరారు చేయలేదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రైవేటు ఆల్బమ్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ