Upasana Konidela: రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. క్లీంకారను ఎప్పుడు చూపిస్తారంటూ నెటిజన్ల కామెంట్స్‌

రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన.. భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ముని కలిశారు.

Published : 16 Mar 2024 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన (Upasana Konidela) ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీ ఫొటోస్‌ను, బిజినెస్‌ టూర్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.

‘ప్రపంచ శాంతి కోసం జరుగుతోన్న గ్లోబల్‌ స్పిర్చువాలిటీ మహోత్సవ్‌లో భారత రాష్ట్రపతిని కలవడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు’ అని పోస్ట్‌ పెట్టారు. వారితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులోనూ క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌ అందరూ ‘క్లీంకార ఫేస్‌ ఎప్పుడు చూపిస్తారు?’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవలే ఉపాసన అయోధ్యను సందర్శించారు. తన తాతయ్య అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్‌ సి రెడ్డితో కలిసి బాలరాముడిని దర్శించుకున్నారు. దానికి ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని