Vijay: ‘వారిసు’ రిలీజ్‌.. ఐదేళ్ల తర్వాత అభిమానుల్ని కలిసిన విజయ్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ తన అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఐదేళ్ల తర్వాత తొలిసారి ఆయన ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొన్నారు.

Updated : 21 Nov 2022 11:26 IST

చెన్నై: దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తన అభిమానుల్ని కలిశారు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay). చెన్నైలోని పనైయూర్‌(Panaiyur)లోని ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ కార్యాలయంలో పలు జిల్లాలకు చెందిన అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యాన్స్‌ని కలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘‘కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం చేసి సంపాదించండి. మీ సంపాదనలో 2 శాతం ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి’’ అని అభిమానుల్ని ఉద్దేశించి విజయ్‌ ప్రసంగించారు. అనంతరం పలువురు అభిమానులతో ఫొటోలు దిగారు. తనని కలిసేందుకు వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ సిద్ధం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విజయ్‌ నటిస్తోన్న ‘వారిసు’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

విజయ్‌ తన అభిమానులతో ప్రతి ఏటా సమావేశమయ్యేవారు. అయితే, కరోనా, ఇతర కారణాల వల్ల దాదాపు ఐదేళ్ల నుంచి ఫ్యాన్స్‌ మీట్‌ నిర్వహించలేదు. దీంతో ఆదివారం జరిగిన ఫ్యాన్స్‌ మీట్‌లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్‌ మక్కల్‌ ఇయక్కంలో సభ్యులైన వారికి మాత్రమే ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్లు సమాచారం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని