avika gor: రెండేళ్లుగా అతనితో డేటింగ్‌ చేస్తున్నా!

నటి అవికాగోర్‌ రహస్యంగా ఒక శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలపై ఆమె స్పందించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్‌.. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్‌ అవతారమెత్తింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

Updated : 22 Jun 2021 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి అవికాగోర్‌ రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలపై ఆమె స్పందించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘చిన్నారి పెళ్లికూతురు’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్‌.. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్‌ అవతారమెత్తింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఒకానొక సమయంలో బొద్దుగా మారడంతో సినిమా అవకాశాలు కోల్పోయింది. తీవ్రమైన మనోవేదనకు గురైన ఆమె క్రమంగా తిరిగి నాజూగ్గా తయారైంది. ఈ క్రమంలోనే ఆమె రహస్యంగా ఓ శిశువుకు జన్మనిచ్చిందన్న వార్తలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో తను మళ్లీ మామూలు మనిషిగా మారడానికి కారణం తన ప్రియుడేనంటూ ఆమె చెప్పుకొచ్చింది. అతనితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నానని వెల్లడించింది.

హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వాణీ అనే యువకుడితో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా అవికాకు పరిచయం ఏర్పడిందట. రెండేళ్ల నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఒక జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనను తాను అర్థం చేసుకోవడానికి మిలింద్‌ ఎంతో తోడ్పడ్డాడని, శారీరకంగా, మానసికంగా తనలో మార్పు రావడానికి అతనే కారణం అని చెప్పింది. కష్ట సమయాల్లో మిలింద్‌లాంటి తోడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అంది. తన సహ నటుడు మనీశ్‌రాయ్‌ సింగన్‌తో కలిసి రహస్యంగా ఒక శిశువుకు జన్మనిచ్చిందంటూ అవికాపై వస్తున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. మనీశ్‌ వయసులో తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడని, మంచి స్నేహితుడని ఆమె అంది. తన జీవితంలో అతనికి ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొంది.

నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రంలో అవికా కీలకపాత్ర పోషిస్తోంది. దీంతోపాటు కల్యాణ్‌దేవ్‌ హీరోగా వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. ఈ రెండు కాకుండా.. మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని