‘కొత్త కవిత’ అంతర్జాతీయ కవి సమ్మేళనం
అంతర్జాలం వేదికగా ఇటీవల నిర్వహించిన ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ
సింగపూర్: అంతర్జాలం వేదికగా ఇటీవల నిర్వహించిన ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ల ఆధ్వర్యంలో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అమెరికా సహకారంతో 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు.
అందరినీ అలరించిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సాహితీవేత్త, కె.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుంచి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని, కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేశారు.
కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు మాట్లాడుతూ ‘వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న ‘కొత్త కథలు’ సంకలనంలాగానే, ఈ సంవత్సరం నుంచి ‘కొత్త కవిత’ అనే కవితా సంకలనం తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతిని పురస్కరించుకొని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చదివిన కవితలన్నీ, కవితా సంకలనంగా డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి సహకారంతో ముద్రిస్తామన్నారు.
భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి కవితా నివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, ఉగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుంచి ఎంతో మంది కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా అందరినీ ఆకర్షించింది. కార్యక్రమ సహ నిర్వాహకులు శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ సింగపూర్ నుంచి తొలిసారి ఈ కార్యక్రమంలో 14 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో ప్రారంభ సమావేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,తూర్పు ఆసియా దేశాల కవితా పఠనం కొనసాగగా, ఆఫ్రికా ఐరోపా ఖండాల వారికి పీసపాటి జయ, మధ్య ఆసియా దేశాలవారికి కొండూరు కళ్యాణి, కెనడా వారికి రాయవరపు లక్ష్మి, అమెరికా వారికి నోరి రాధిక సహవ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల