అమెరికాలో చదువుకు.. విద్యార్థుల్లో పెరిగిన ఆసక్తి
అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగిందని ఎడ్యుకేషన్ యూఎస్ఏ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్ వెల్లడించారు. కరోనా పరిస్థితులున్నా విద్యార్థుల సంఖ్య తగ్గలేదన్నారు. గతేడాది భారత్ నుంచి సుమారు 2 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యాసంస్థల్లో చేరారని,
గతేడాది 2 లక్షల మంది చేరిక
ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ రికార్డు స్థాయిలో వీసాలు జారీ
విద్యాసంస్థల్లో కరోనా నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు
‘ఈనాడు’తో అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్
ఐ.ఆర్.శ్రీనివాసరావు ఈనాడు, హైదరాబాద్
అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగిందని ఎడ్యుకేషన్ యూఎస్ఏ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్ వెల్లడించారు. కరోనా పరిస్థితులున్నా విద్యార్థుల సంఖ్య తగ్గలేదన్నారు. గతేడాది భారత్ నుంచి సుమారు 2 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యాసంస్థల్లో చేరారని, గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో ప్రస్తుతం విద్యార్థి వీసాలు జారీ చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం శుక్రవారం (27న), ఆ తరవాతి శుక్రవారం (సెప్టెంబరు 3న) వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
ప్రస్తుతం నెలకొన్న కరోనా సవాళ్ల మధ్య అమెరికాలో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థుల స్పందన ఎలా ఉంది?
జ: కరోనా సృష్టించిన సవాళ్లను అధిగమించడం ప్రజలకే కాదు.. ప్రభుత్వాలకూ తలకు మించిన భారంగా మారింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. యూఎస్ఏలో చదువుకోవాలన్న ఆసక్తి విద్యార్థుల్లో ఎక్కువగానే ఉంది. 2019-20 సంవత్సరంలో 10,75,496 మంది విదేశీ విద్యార్థులు చదువుల కోసం యూఎస్ఏ వచ్చారు. వారిలో 2 లక్షల మంది వరకు భారతీయులే. ప్రస్తుత విద్యా సంవత్సరంలోని ఫాల్ సీజన్ (ఆగస్టు-సెప్టెంబరు)లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 55 వేల మంది వీసాలు పొందారు. కరోనా పరిస్థితుల్లోనూ అమెరికాలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఈ గణాంకాలే చెబుతున్నాయి.
అమెరికాలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలను కల్పిస్తున్నారు?
జ: కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. మరికొన్ని వర్సిటీలు హైబ్రీడ్ విధానంలో తరగతులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రతి ప్రాంగణంలో కరోనా పరీక్షల కేంద్రాలు, అత్యవసరమైతే క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. వ్యాక్సిన్ వేసేందుకూ సదుపాయాలను కల్పించాయి. విద్యార్థులు https:// www.cdc.gov ద్వారా కొవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుత సీజనులో అమెరికా వెళుతున్న విద్యార్థులకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ ఫేస్బుక్, ఆన్లైన్ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.
గత విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులు ఆన్లైన్ తరగతులే వినాలా? అమెరికాకు వెళ్లి ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశం ఉందా?
జ: గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఇప్పుడు నిస్సందేహంగా అమెరికా వెళ్లొచ్చు. గత విద్యాసంవత్సర ప్రారంభ సమయంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. మిగిలిన సెమిస్టర్ల పూర్తి కోసం యూఎస్ఏ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వీసాలు జారీ చేస్తోంది.
వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
జ: వర్చువల్ ఫెయిర్ను రెండు దశల్లో నిర్వహిస్తున్నాం. మాస్టర్స్, పీహెచ్డీ చేయాలనుకునే వారికి శుక్రవారం (27న) భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉంటుంది. డిగ్రీ తదితర కోర్సులు చదువుకునే వారి కోసం సెప్టెంబరు 3వ తేదీన నిర్వహిస్తున్నాం. సుమారు వంద విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొంటాయి. ఏయే సబ్జెక్టులకు డిమాండు ఉంది, ఆ తరవాత ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి, ఫీజులు ఎలా ఉంటాయి, ఉపకార వేతనాలు పొందటం ఎలా, వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. తదితర అంశాలను వివరిస్తారు. భవిష్యత్తులో అమెరికాలో పిల్లలను చదివించాలనుకునే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. కన్సల్టెంట్లను ఆశ్రయించే పరిస్థితి లేకుండా దీని ద్వారా పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. వర్చువల్ ఫెయిర్లో పాల్గొనేవారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలి. మాస్టర్స్, పీహెచ్డీ విద్యార్థులు https://bit.ly/EdUSAFair21EmbWeb , డిగ్రీ తదితరాలు చదువాలనుకునే వారు https://bit.ly/UGEdUSAFair21EmbWeb ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పేర్లు నమోదు చేసుకున్న వారి ఈ మెయిల్కు వర్చువల్ ఫెయిర్లో పాల్గొనేందుకు అవసరమైన సమాచారం వస్తుంది.
మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ: అమెరికాలో 4,700 వరకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉన్నాయి. అక్రిడిటేషన్ ఉన్న సంస్థలను ఎంచుకోవాలి. కన్సల్టెంట్లను ఆశ్రయించే బదులు www.petersons.com, www.edupass.org, http://ncs.ed.gov/collegenavigator, https://educartionusa.state.gov/your-5-stemps-us-study/research-your-options వెబ్సైట్లు పరిశీలించి అర్హతల వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా విద్యార్థులు usiefhyderabad@usief.org.in లేదా hyderabad@educationusa.org మెయిల్ అడ్రస్కు ఈ-మెయిల్ పంపి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి .
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు