తొలి వార్షిక సదస్సు ఘనంగా నిర్వహించాలని ‘మాటా’ బోర్డు నిర్ణయం
వచ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయల్ అల్బర్ట్ ప్యాలెస్లో 'మాటా' తొలి వార్షిక సదస్సును ఘనంగా నిర్వహించాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఫిలిడెల్ఫియా: అమెరికాలో 'మన అమెరికా తెలుగు సంఘం' (మాటా) బోర్డు సమావేశం ఫిలడెల్ఫియాలోని ఫిల్లీ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. కింగ్ ఆఫ్ ప్రుశ్యాలోని క్రౌన్ ప్లాజా ఫిలిడెల్ఫియాలో ‘మాటా’ అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మాటా' విస్తరిస్తున్న క్రమంపై బోర్డు సభ్యులంతా హర్షం వ్యక్తంచేశారు. మాటా ప్రారంభమైన అనతి కాలంలోనే అనేక కార్యక్రమాలతో పలుచోట్ల విస్తరిస్తూ పెద్ద సంస్థగా గుర్తింపు పొందుతోందన్నారు. ఇప్పటికే 25 నగరాల్లో 3వేలకు పైగా కుటుంబాలు; వ్యక్తిగత సభ్యత్వాల ప్రకారం చూసుకుంటే 7500లకు చేరుకుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ‘మాటా’ అనేక కార్యక్రమాలను చేపడుతోంది. కులమత, ప్రాంతీయ భేదాలు లేకుండా తెలుగు వారందరినీ కలుపుకొని తీసుకెళ్లాలన్న ఉద్దేశమే ఈ సంస్థ ఇంత త్వరగా వృద్ధి చెందడానికి కారణమని 'మాటా' బోర్డు సభ్యులు చెబుతున్నారు.
‘మాటా’ బోర్డు సమావేశంలో తమ భవిష్యత్ కార్యక్రమాలపై సభ్యులంతా చర్చించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 13, 14 తేదీలలో న్యూజెర్సీలో రాయల్ అల్బర్ట్ ప్యాలెస్లో 'మాటా' తొలి వార్షిక సదస్సును ఘనంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మరోవైపు, వార్షిక సదస్సు నిర్వహణ కోసం మాటా బోర్డు $225,000 డాలర్లను సేకరించింది. డిసెంబర్ 9న చికాగోలో, డిసెంబర్ 16న సీటెల్లో, డిసెంబర్ 17న బే ఏరియాలో కిక్ ఆఫ్ ఈవెంట్లను నిర్వహించాలని మాటా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ బోర్డు సమావేశానికి హాజరైన 'తానా' సంఘం నాయకులు రవి పొట్లూరి 'మాటా'కు మద్దతు తెలిపారు. 'త్రిబుల్ ఏ' ఆర్గనైజేషన్ సభ్యులు కూడా పాల్గొని మద్దతు ప్రకటించారు. బోర్డు సమావేశం అనంతరం కమ్యూనిటీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కల్చరల్ ప్రొగ్రామ్, లైవ్ ఎంటర్టైన్మెంట్ నిర్వహించారు. గౌరవ సలహాదారులు డాక్టర్ హరి ఎప్పనపల్లి, ప్రసాద్ కూనిశెట్టి, బాబురావు సామల, వెంకటేష్ ముత్యాల, జైదీప్ రెడ్డి 'మాటా' బోర్డు కమిటీకి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఈ బోర్డు సమావేశంలో ఎగ్జిక్యూటివ్ టీమ్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గూడురు, ట్రెజరర్ గంగాధర్ వుప్పాల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుడ్డగి, జాయింట్ సెక్రటరీ టోనీ జాను, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, జాయింట్ ట్రెజరర్ వెంకట్ సుంకిరెడ్డి, నేషనల్ కో-ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ కలాల్, ఈవెంట్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ నగేష్ చిలకపాటి, ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు రాజ్ ఆనందేశి, శ్రీధర్ గుడాల, శ్రీనివాస్ తాటిపాముల, ఇండియా కో-ఆర్డినేటర్ డా. విజయ్ భాస్కర్ బోల్గం.. వంటి వారితో పాటు ఇతర డైరెక్టర్ల బోర్డు సభ్యులు మల్లిక్ బొల్లా, మహేందర్ నరలాల, డా. సరస్వతి, కృష్ణశ్రీ గంధం, పావని సనం, రామ్ మోహన్ చిన్నాల, , విజయ్ గడ్డం, ప్రశాంతశ్రీ పెరంబుదూరు, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు సలహా మండలి సభ్యులు జితేందర్ రెడ్డి, ప్రదీప్ సామల, గౌరవ సలహాదారులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, వివిధ చాప్టర్లకు చెందిన వీఆర్పీలు, స్టాండింగ్ కమిటీ, ఆర్సీలు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం