ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పూతలపట్టులో క్రికెట్‌ లీగ్‌

తెలుగు దేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గంలో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. 

Published : 28 Dec 2023 15:13 IST

పూతలపట్టు: తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో చిత్తూరుజిల్లా పూతలపట్టులో క్రికెట్‌ పోటీలు నిర్వహించారు.  డిసెంబర్‌ 23, 24 తేదీల్లో నిర్వహించిన క్రికెట్‌ లీగ్‌లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు దేశం పార్టీకి చెందిన ఎన్నారైలు గత నాలుగేళ్లుగా పూతలపట్టు నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. యువగళం పాదయాత్రలోనూ పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. యూకే టీడీపీ ఎన్నారైలు ఊట్ల శ్యాం సుందర్‌రావు, దగ్గుపాటి బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఈ పోటీలకు తరలివచ్చిన యువతకు తెదేపా ఆరు గ్యారంటీలతో పాటు నియోజకవర్గంలో చేయాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలను వివరించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది నిర్వహించిన ఎన్నారై టీడీపీ క్రికెట్‌ లీగ్‌లో 20కి పైగా క్రికెట్‌ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా పూతలపట్టు నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్‌ కలిగిరి మురళీ మోహన్‌, పూతలపట్టు మండల పార్టీ అధ్యక్షుడు దొరబాబు చౌదరి, చిత్తూరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్దిలి హేమాద్రి నాయుడు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి యువరాజులు నాయుడు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. పూతలపట్టులో ఎన్నారై తెదేపా యూరప్‌ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యత చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లోనూ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలకు వాళ్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు.  ఎన్నారై యూరప్‌ నుంచి శ్యామ్‌  ఊట్ల, బాలకృష్ణ దగ్గుపాటితో పాటు వాళ్ల కోర్‌ టీమ్‌ సభ్యులు డా.కిశోర్‌ బాబు, వివేక్‌ కరియువుల, అమర్‌నాథ్‌ పొట్లూరి, కృష్ణ ప్రసాద్‌ కాట్రగడ్డ, విజయ్‌ అడుసుమిల్లి, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్‌ గోగినేని, ప్రవీణ్‌ ఉన్నం, సుమంత్‌ పడాల, శివకృష్ణ, రామకృష్ణ, సతీశ్‌ ముళ్లపూడి, సాయి వెంకట మౌర్య అందరితో కలిసి భవిష్యత్తు కార్యక్రమాల్లో కలిసి ముందుకు వెళ్తానన్నారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన నిర్వాహకులు దగ్గుపాటి మోహన్ , దగ్గుపాటి లోకేష్, బద్దిలి పృథ్వీ , మామిడిపల్లి సాయి మోహన్‌కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యకమానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలు ఊట్ల నాగరాజు నాయుడు (మాజీ మార్కెట్‌యార్డు డైరెక్టర్‌), సీనియర్‌ నాయకులు దగ్గుపాటి లక్ష్మీనారాయణ, బొమ్మన శ్రీధర్‌, మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ కాంతారావు, మాజీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి, బైటపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దినేని మోహన్‌, తెదేపా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కె.సుబ్బరాజులు, మాజీ ఎంపీటీసీ కె.నాగరాజు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని