ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పూతలపట్టులో క్రికెట్ లీగ్
తెలుగు దేశం పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు.
పూతలపట్టు: తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో చిత్తూరుజిల్లా పూతలపట్టులో క్రికెట్ పోటీలు నిర్వహించారు. డిసెంబర్ 23, 24 తేదీల్లో నిర్వహించిన క్రికెట్ లీగ్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు దేశం పార్టీకి చెందిన ఎన్నారైలు గత నాలుగేళ్లుగా పూతలపట్టు నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. యువగళం పాదయాత్రలోనూ పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. యూకే టీడీపీ ఎన్నారైలు ఊట్ల శ్యాం సుందర్రావు, దగ్గుపాటి బాలకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఈ పోటీలకు తరలివచ్చిన యువతకు తెదేపా ఆరు గ్యారంటీలతో పాటు నియోజకవర్గంలో చేయాల్సిన భవిష్యత్తు కార్యక్రమాలను వివరించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది నిర్వహించిన ఎన్నారై టీడీపీ క్రికెట్ లీగ్లో 20కి పైగా క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా పూతలపట్టు నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ కలిగిరి మురళీ మోహన్, పూతలపట్టు మండల పార్టీ అధ్యక్షుడు దొరబాబు చౌదరి, చిత్తూరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు బద్దిలి హేమాద్రి నాయుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి యువరాజులు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. పూతలపట్టులో ఎన్నారై తెదేపా యూరప్ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా పలు కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యత చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లోనూ నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలకు వాళ్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు. ఎన్నారై యూరప్ నుంచి శ్యామ్ ఊట్ల, బాలకృష్ణ దగ్గుపాటితో పాటు వాళ్ల కోర్ టీమ్ సభ్యులు డా.కిశోర్ బాబు, వివేక్ కరియువుల, అమర్నాథ్ పొట్లూరి, కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, విజయ్ అడుసుమిల్లి, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, ప్రవీణ్ ఉన్నం, సుమంత్ పడాల, శివకృష్ణ, రామకృష్ణ, సతీశ్ ముళ్లపూడి, సాయి వెంకట మౌర్య అందరితో కలిసి భవిష్యత్తు కార్యక్రమాల్లో కలిసి ముందుకు వెళ్తానన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన నిర్వాహకులు దగ్గుపాటి మోహన్ , దగ్గుపాటి లోకేష్, బద్దిలి పృథ్వీ , మామిడిపల్లి సాయి మోహన్కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యకమానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలు ఊట్ల నాగరాజు నాయుడు (మాజీ మార్కెట్యార్డు డైరెక్టర్), సీనియర్ నాయకులు దగ్గుపాటి లక్ష్మీనారాయణ, బొమ్మన శ్రీధర్, మాజీ డీసీసీబీ ఛైర్మన్ కాంతారావు, మాజీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి, బైటపల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దినేని మోహన్, తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు కె.సుబ్బరాజులు, మాజీ ఎంపీటీసీ కె.నాగరాజు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.