DL Ravindrareddy: తెదేపా అభ్యర్థికే నా మద్దతు: మాజీ మంత్రి డీఎల్‌

తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. 

Published : 09 Apr 2024 14:51 IST

ఖాజీపేట: తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భాజపాతో పొత్తుతో 30 సీట్లలో ప్రభావం చూపుతోందని, జనసేనకు క్యాడర్‌ లేదన్నారు. తెదేపాకు వ్యతిరేకమైనా స్థానిక రాజకీయాల కారణంగా తెదేపా అభ్యర్థి సుధాకర్‌యాదవ్‌కే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ అభ్యర్థికి ఓటు వేసే విషయంలో ‘వివేకం’ సినిమా చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని