Revanth Reddy: సాగుకు 8 గంటల కరెంటు చాలు
వ్యవసాయానికి రోజూ 8 గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు ఇస్తే చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపాయి.
పెనుదుమారం రేపిన రేవంత్ వ్యాఖ్యలు
విరుచుకుపడిన భారాస మంత్రులు, శ్రేణులు
భారాస వక్రీకరిస్తోందంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్
విమర్శలు చెలరేగడంతో వివరణ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు
ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ పేటెంట్ స్కీం అని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయానికి రోజూ 8 గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు ఇస్తే చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును తొలగిస్తుందని భారాస ఆరోపించింది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా దీటుగా ప్రతి విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారాస వక్రీకరిస్తోందని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బుధవారం గాంధీభవన్లో కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహదీక్షను నీరుగార్చేందుకే భారాస దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.ఉచిత విద్యుత్తుపై కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వివాదం చెలరేగిందిలా..
అమెరికాలోని తానా సభలకు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిరంతరాయంగా ఉచిత కరెంటు, రైతుబంధు ఇస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తారా, బంద్ చేస్తారా’ అని ఒక ప్రవాసుడు ప్రశ్నించగా.. రేవంత్రెడ్డి బదులిచ్చారు. ‘ఎకరానికి నీరివ్వాలంటే వ్యవసాయ బోరుకు ఒక గంటసేపు కరెంటు ఇస్తే సరిపోతుంది. తెలంగాణలో 95 శాతం మంది రైతులకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నందున అందులో పంటల సాగుకు 3 గంటలసేపు కరెంటు ఇస్తే నీరందించవచ్చు. మొత్తంగా వ్యవసాయానికి రోజూ 8 గంటల సేపు విద్యుత్తు చాలు’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘విద్యుత్ సంస్థల దగ్గర కమీషన్ల కోసం కేసీఆర్ ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఉచితం అనే పేరుతో అనుచితంగా వ్యవహరించవద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత కరెంటు విషయంలో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లో తెలిపింది’ అని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో రేవంత్రెడ్డి ట్విటర్లో, విడిగా వివరణ విడుదల చేశారు. ‘ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్ పేటెంట్ స్కీం. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో రైతులను మోసం చేస్తున్న కేసీఆర్కు కాంగ్రెస్ను వేలెత్తి చూపించే అర్హత లేదు. భారాస, భాజపాకు బి టీం అని మరోసారి నిరూపితమైంది. రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం గాంధీభవన్లో సత్యాగ్రహదీక్ష చేపట్టాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును నీరుగార్చేందుకు ఉచిత విద్యుత్పైకి ప్రజల దృష్టిని మరల్చాలని భారాస ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ఏ సబ్స్టేషన్కు వెళ్లినా తెలుస్తుంది. ఈ మోసాలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం అన్ని మండల కేంద్రాల్లో, సబ్స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలి’ అని తెలిపారు.
రేవంత్ స్థాయికి మించి మాట్లాడారు: కోమటిరెడ్డి
రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందిస్తూ.. మీడియాకు వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘వ్యవసాయానికి ఉచిత కరెంటుపై రేవంత్ స్థాయికి మించి మాట్లాడారు. ఉచిత విద్యుత్ నిర్ణయం ఆయన పరిధిలోనిది కాదు. రైతులకు 3 గంటలు విద్యుత్ ఇవ్వాలనడం రేవంత్ తప్పే. అమెరికా వెళ్లి ఎందుకలా మాట్లాడారో తెలియదు. సీతక్క సీఎం అవుతారనేది పెద్ద జోక్. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతాం’ అని వెంకట్రెడ్డి తెలిపారు.
భారాస గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దు: భట్టి విక్రమార్క
‘ఉచిత విద్యుత్ పథకంపై పేటెంట్ హక్కు పూర్తిగా కాంగ్రెస్దే. మా పార్టీ అధికారంలోకి వస్తే.. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాను ప్రాధాన్యాంశంగా అమలు చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా భారాస నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.
వరంగల్ డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నాం: జీవన్రెడ్డి
రేవంత్రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి భారాస నాయకులు ఆందోళనకు దిగడం అనాలోచితమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి జగిత్యాలలో విలేకరులతో అన్నారు. తమ పార్టీ వరంగల్ డిక్లరేషన్కు కట్టుబడి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తుందన్నారు.
కేటీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారు: మధుయాస్కీ
కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వటమే మా విధానం. రేవంత్ మాటలను భారాస వక్రీకరిస్తోంది. కేటీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారు. విద్యుత్ కొనుగోలు అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంది. అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేసి కరెంట్ కోతలపై నిలదీయండి’ అన్నారు. రేవంత్రెడ్డి మాటలు కాంగ్రెస్ విధాన నిర్ణయం కాదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. -
పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి నియమితులయ్యారు. -
నిర్ణేతలు బీసీలే!
బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్లోని 8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహరాజ్గంజ్లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు. -
ప్రజా విశ్వాసమే నా సంపద
ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే. -
మంచిరోజులు వస్తున్నాయి.. మోదీ వెళ్లిపోతున్నారు: కేజ్రీవాల్
త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో 59% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
దేశం మార్పు తుపాను చూస్తోంది: రాహుల్
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నవీన్ పట్నాయక్ చుట్టూ అవినీతి కోటరీ
రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. -
ఫరీద్కోట్ లోక్సభ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టి
పంజాబ్లోని ఫరీద్కోట్ (ఎస్సీ) లోక్సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్కే సీపీఐ మద్దతు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందన్నారు. -
సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలా?
పోలింగ్ అనంతర హింసపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించకుండా.. కేవలం సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. -
ఐప్యాక్తో పాటు ఖాళీ అయిన సీఐడీ కార్యాలయం
ఎన్నికల తర్వాత వైకాపా సోషల్ మీడియా, ఐప్యాక్ల బృందంతో పాటు జగన్ కనుసన్నల్లో నడిచిన సీఐడీ కార్యాలయం కూడా ఖాళీ అయిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. -
ప్రశాంత పల్నాడులో వైకాపా అశాంతి రేపింది
ప్రశాంత పల్నాడులో వైకాపా నేతలు అశాంతి రేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీపీఐ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని విడనాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.