పుణెలో బాబాయ్‌ భోజనానికి వచ్చారంతే: అజిత్‌ పవార్‌

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ఇటీవల పుణెలో తాను సమావేశమవటం అతి సాధారణమైనదేనని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు.

Published : 16 Aug 2023 04:48 IST

ముంబయి: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ఇటీవల పుణెలో తాను సమావేశమవటం అతి సాధారణమైనదేనని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఆ భేటీపై ఇప్పటికే శరద్‌ పవార్‌ కూడా స్పష్టత ఇచ్చారన్నారు. కొల్హాపుర్‌లో మంగళవారం మీడియాతో అజిత్‌ మాట్లాడారు. ‘భేటీ అనంతరం కారులో రహస్యంగా ఎందుకు వెళ్లారు?’ అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆ కారులో తాను లేనని అజిత్‌ పవార్‌ చెప్పారు. అతుల్‌ కుటుంబంతో తమకు రెండు తరాల నుంచి మంచి సంబంధాలున్నాయని, శరద్‌పవార్‌ను శనివారం ఆయన భోజనానికి ఆహ్వానించారన్నారు. చాందినీ చౌక్‌ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న తర్వాత తాను కూడా అక్కడికి వెళ్లినట్లు అజిత్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని