BRS: జనగామ టికెట్‌ కేటాయించాలంటూ కేసీఆర్‌ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం

రానున్న శాసనసభ ఎన్నికల్లో జనగామ భారాస టికెట్‌ కోసం స్థానికేతరులైన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రయత్నాలు మానుకోవాలని ఆప్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు డిమాండ్‌ చేశారు.

Updated : 28 Aug 2023 08:06 IST

ఆప్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: రానున్న శాసనసభ ఎన్నికల్లో జనగామ భారాస టికెట్‌ కోసం స్థానికేతరులైన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రయత్నాలు మానుకోవాలని ఆప్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో కలిసి జనగామలో ఆదివారం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్సీలకూ ఇంకా పదవీకాలం ఉందని, ఎమ్మెల్యే కావాలనుంటే వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బీసీ వర్గానికి చెందిన తనకే జనగామ టికెట్‌ కేటాయించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి శ్రీరాములు సాష్టాంగ నమస్కారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని