కాంగ్రెస్కు కాలం చెల్లింది.. రాజ్యసభలో ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, వారంటీ అయిపోయిందని, ఆలోచించే శక్తిని కూడా కోల్పోయి ఆ పనిని వేరెవరికో అప్పగిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు.
దిల్లీ: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, వారంటీ అయిపోయిందని, ఆలోచించే శక్తిని కూడా కోల్పోయి ఆ పనిని వేరెవరికో అప్పగిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ప్రజాస్వామ్య గొంతును నులిమిన పార్టీ, ప్రజా ప్రభుత్వాలను రాత్రికి రాత్రి కొన్ని డజన్లసార్లు కూల్చిన పార్టీ, అన్నివిధాలా దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ ఇప్పుడు భారత్ను రెండు ముక్కలు చేయాలని చూస్తోంద’ని ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరసేపు ప్రసంగించి.. కాంగ్రెస్ను తూర్పారబట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
భద్రత గురించి మీరు చెప్పడమేంటి?
‘‘కాంగ్రెస్లో వారి నేతకే గ్యారంటీ లేదు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే కారణం. ఆ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. మనదేశ భూభాగాలను శత్రువులకు అప్పగించింది ఆ పార్టీయే. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రభుత్వాలను పడగొట్టింది. అలాంటి కాంగ్రెస్.. జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలవారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూ.. రిజర్వేషన్లను వ్యతిరేకించారు. అంబేడ్కర్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లే వచ్చేవి కావు.
ఖర్గేకు ఆ స్వేచ్ఛ ఎలా వచ్చిందో?
ఈసారి ఎన్నికల్లో హస్తం పార్టీ 40 స్థానాలు కూడా సాధించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల అన్నారు. కనీసం మీరు ఆ 40 సీట్లైనా గెలవాలని నేను కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో మాకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే (రాజ్యసభలో విపక్ష నేత) అంచనా వేశారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుంది. ఆరోజు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా లభించిందని నేను ఆశ్చర్యపోయా. ఈసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే. కొందరు దానిని మోదీ 3.0 సర్కారు అంటున్నారు. ఆ సర్కారులో ‘వికసిత భారత్’ పునాదుల బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. 2047 నాటికి భారత్ తిరిగి స్వర్ణయుగంలోకి వెళ్తుంది.
ఆయన దేనినీ స్టార్ట్ చేయడు
కాంగ్రెస్ పార్టీ పదేపదే ఒకే ఉత్పత్తి (రాహుల్ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ ఆయన దేనినీ స్టార్ట్ చేయడు. కాంగ్రెస్ పార్టీ తన పనిని అవుట్ సోర్సింగ్కు అప్పగించింది. బ్రిటిష్వారి నుంచి కాంగ్రెస్ స్ఫూర్తి పొందింది. దశాబ్దాలుగా బానిసత్వ చిహ్నాలను కొనసాగించింది.
అసలు అదేం భాష..?
జాతీయ నిధులపై రాష్ట్రాలు రాజకీయం చేయడం సరికాదు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై మేం సంకుచిత ఆలోచనలు చేయం. ‘మా పన్నులు.. మా డబ్బులు’ అంటున్నారు. అసలు అదేం భాష..? దేశమంటే మన దేహంలాంటిది. ఒక్క భాగం పనిచేయకపోయినా వైకల్యం వస్తుంది. హిమాలయాల నుంచి వచ్చే నీటిని, తమ రాష్ట్రాల్లో ఉన్న బొగ్గును ఇతరులకు ఇవ్వబోమని ఎవరైనా అంటే దేశం పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్రాలపై మాకు వివక్ష ఉండదు. స్వతంత్ర భారత్లో జన్మించిన నా ఆలోచనలు కూడా స్వతంత్రంగా ఉంటాయి. మేం పీఎస్యూలను విక్రయించామని, వాటిని ధ్వంసం చేశామని కాంగ్రెస్ విమర్శించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను ఎవరు నిర్వీర్యం చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఎయిరిండియా పరిస్థితికి కారణం ఎవరు?’’ అని మోదీ ప్రశ్నించారు.
మాపై విమర్శలతోనే సరిపోయింది: కాంగ్రెస్
‘‘ప్రస్తుత పార్లమెంటులో ప్రధానిది ఇదే చివరి ప్రసంగంగా భావిస్తున్నారు. ఆయన ప్రసంగమంతా మమ్మల్ని విమర్శించడంతోనే సరిపోయింది. రిజర్వేషన్లను ఇచ్చిందే మా పార్టీ. యూపీఏ గురించి మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగమంతా అబద్ధాల పుట్ట అని రాహుల్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
PM Modi: రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో తాను సంపాదించుకున్న విశ్వాసం ఫలితమే తనకు ‘బ్రాండ్ మోదీ’ అనే గుర్తింపునిచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. తానో కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. -
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేడీ ప్రభుత్వ విధానాలను ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఈసందర్భంగా పూరీ ఆలయ భాండాగారం ప్రస్తావన తెచ్చారు. -
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో గాయపడిన బాధితుల గోడును ప్రసారం చేసిన మీడియాపై కేసులు పెట్టడం దారుణమని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
-
ఆ భాండాగారం తాళం చెవులు ఎక్కడ..? ప్రశ్నించిన మోదీ
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి