ఒంగోలు లోక్‌సభ తెదేపా టికెట్‌ మాగుంట శ్రీనివాసులురెడ్డికే!

ఒంగోలు లోక్‌సభ టికెట్‌ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలని తెదేపా నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు సీటుకు శ్రీనివాసులురెడ్డితోపాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది.

Updated : 26 Mar 2024 06:44 IST

ఈనాడు, అమరావతి, ఒంగోలు: ఒంగోలు లోక్‌సభ టికెట్‌ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే కేటాయించాలని తెదేపా నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు సీటుకు శ్రీనివాసులురెడ్డితోపాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులురెడ్డినే తెదేపా ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి సోమవారం ఒంగోలులో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా పోటీ చేస్తున్న 17 లోక్‌సభ స్థానాల్లో ఒంగోలుతో పాటు విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని