మా ‘పన్నీరు సెల్వం’ ఎవరో?.. మాజీ సీఎంకు పోటీగా నలుగురు ఓపీఎస్లు
తమిళనాడులోని రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్డీయే కూటమి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరు సెల్వంకు ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో నలుగురు స్వతంత్రులతో ఇబ్బంది ఏర్పడింది.
రామనాథపురంలోవిచిత్ర పరిస్థితి
ఈనాడు, చెన్నై: తమిళనాడులోని రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్డీయే కూటమి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరు సెల్వంకు ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో నలుగురు స్వతంత్రులతో ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఈ ఐదుగురు ఒ.పన్నీరు సెల్వంలు ప్రచారంలో ఉన్నారు. అందరూ స్వతంత్రులే కావడంతో ఎవరు అసలు ఒ.పన్నీరు సెల్వమో గుర్తించేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఎన్డీయే కూటమిలో తానే ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఓపీఎస్ ప్రచారం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకే తనను బహిష్కరించడంతోపాటు తాను రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు న్యాయస్థానాలు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే శ్రేణులు తనవైపు ఉన్నారా.. ఈపీఎస్ వైపు ఉన్నారా తేల్చుకునేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇదివరకు ఆయన ప్రకటించారు. ఇదే అతి పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా రామనాథపురం స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది. చివరికి ఓపీఎస్కు కేటాయించారు. భాజపా మద్దతుతో బరిలో ఉన్న ఒ.పన్నీరు సెల్వానికి పనసపండు గుర్తు కేటాయించారు. మిగిలిన నలుగురికీ బకెట్, చెరకుతో రైతు, ద్రాక్ష, గాజు గ్లాసు గుర్తులు వచ్చాయి. బ్యాలెట్ పేపరులో ఈ స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం, వరుస సంఖ్యలోనూ గందరగోళం ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నా బ్యాలెట్ పేపరుపై పొట్టి అక్షరం ‘ఒ’నే వాడుతుండటంతో అందరి పేర్లూ ఒకేలా ఉండనున్నాయి. కేవలం చిహ్నం చూసి మాత్రమే జనాలు అసలు ఓపీఎస్ ఎవరో గుర్తుపట్టాల్సి వస్తోంది. పొరపాటు జరిగితే ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఈ పరిస్థితిపై ఓపీఎస్ తల పట్టుకుంటున్నారు. ఇప్పుడాయనకు మరో తలనొప్పి వచ్చిపడింది. ప్రచారంలో అలవాటు ప్రకారం పొరపాటున ‘రెండాకుల గుర్తు’కు ఓటు వేయండని నోరు జారుతున్నారు. అదే స్థానం నుంచి అన్నాడీఎంకే రెండాకులపై జయపెరుమాల్ పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక ఆయనకు పెద్ద సవాల్గా మారుతోంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 25 మంది పోటీలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున ఐయూఎంఎల్ అభ్యర్థి నవాజ్ కని బరిలో ఉన్నారు.
పనస పండ్లకు గిరాకీ..
మాజీ సీఎం ఓపీఎస్కు పనస పండు గుర్తు కేటాయించారు. స్వతంత్రుల్లో ఓపీఎస్ల బెడద పెరగడంతో తమ పనస పండు గుర్తును పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని పన్నీరు సెల్వం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ అనుచరులు పనస పండ్లు కొనుగోలు చేసి ప్రచారాలకు తీసుకెళ్తున్నారు. టన్నులకొద్దీ తమ వెంట తీసుకెళ్తున్నారు. స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. వాటిని పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రామనాథపురంలోని ప్రముఖ వ్యాపారులు రోజుకు 30, 40 టన్నుల పనస పండ్లు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్లు మరింతగా వస్తుండటంతో విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!