కాంగ్రెస్ బలహీనతలే భాజపా బలం!
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతలే అధికార భాజపాకు బలంగా మారుతున్నాయి. ఆ కారణంగానే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళం తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది.
ఉత్తర భారతంపై కాషాయ దళానికి గట్టి పట్టు
కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రత్యర్థులు
కోలుకోలేకపోతున్న కాంగ్రెస్
ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనతలే అధికార భాజపాకు బలంగా మారుతున్నాయి. ఆ కారణంగానే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళం తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. మోదీ, అమిత్ షాల ద్వయం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. వాటిని ఛేదించడం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదు. భాజపా, కాంగ్రెస్ల మధ్య ముఖాముఖి పోటీ నడిచే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గోవా, ఉత్తరాఖండ్, అస్సాంలలో భాజపా తిరుగులేని ఓట్ల శాతంతో ప్రత్యర్థికి అందనంత దూరంలో ఉంటోంది. ఈ 10 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 133 సీట్లుండగా 2019లో భాజపా 128 సీట్లు సాధించి 96.24% స్థానాలను ఒడిసిపట్టుకుంది. ఉత్తర భారత దేశంలో ముఖ్య రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్లలో భాజపా, కాంగ్రెస్లు రెండూ కూటమిగా పోటీ చేస్తున్నాయి.
అయితే ఎన్డీయే కూటమికి భాజపా తలలా వ్యవహరిస్తుంటే.. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి తోకలా మారింది. 120 స్థానాలున్న ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా సొంతంగా గత ఎన్నికల్లో 79 స్థానాలను, కూటమి పార్టీలతో కలిసి 103 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్కు వచ్చింది కేవలం రెండు స్థానాలే. భాజపా కూటమి 85.83% స్థానాలను కైవసం చేసుకుంటే.. ప్రత్యర్థి కూటమి కేవలం 14.16% సీట్లనే సొంతంగా చేసుకోగలిగింది. దేశంలోని లోక్సభ సీట్లలో 46.59% స్థానాలున్న ఈ 12 రాష్ట్రాల్లో 91.30% స్థానాలను కైవసం చేసుకుని భాజపా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్లో క్రితంసారి కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా, ఈసారి సమాజ్వాదీ పార్టీతో కలిసి రంగంలోకి దిగుతోంది. అదొక్కటే ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇదే సమయంలో కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీని వదిలి భాజపా పంచన చేరాయి.
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే హిందీ రాష్ట్రాల్లో బలమైన ప్రభావం చూపగలిగే స్థితిలో ఉండాలి. ఈ సూత్రాన్ని భాజపా వంటబట్టించుకుని పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుంటే కాంగ్రెస్ మనుగడ కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లు రావడానికి పంజాబ్లో వచ్చిన 8 సీట్లు ఎంతో దోహదం చేశాయి. కేరళ, తమిళనాడు తర్వాత ఉత్తర భారత దేశంలో ఆ పార్టీకి దక్కిన అత్యధిక సీట్లు ఇవే. ఇప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ కాంగ్రెస్ను గతంలో నడిపించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపాలో చేరారు. అక్కడ కాంగ్రెస్, ఆప్, భాజపా, శిరోమణి అకాలీదళ్ల మధ్య పోటీ చతుర్ముఖంగా తయారైంది. రాజస్థాన్లో ఐదేళ్లకోసారి అధికారం చేపట్టినా గత రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సున్నాకే పరిమితమైంది.
గత లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భాజపా 59% ఓట్లు సాధిస్తే.. కాంగ్రెస్ 34%కే పరిమితమైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ యాత్రలు నిర్వహించినా ఉత్తర భారతంలో పెద్దగా ప్రభావం కనిపించనట్లే ఉంది. ఉత్తర్ ప్రదేశ్లో ఇండియా కూటమికి తలలా వ్యవహరించే సమాజ్వాదీ పార్టీ భాజపా తరహాలో దూకుడుగా లేకపోవడం ప్రతిపక్ష బలాన్ని పెంచలేకపోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 15 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అస్సలు ఖాతానే తెరవలేకపోయింది. కేరళలో మినహాయించి ఇంకెక్కడా రెండంకెల సంఖ్యను చేరుకోలేకపోయింది.
పుదుచ్చేరిలో మినహా మిగిలిన ఎక్కడా 50% ఓట్లను మించి సాధించలేకపోయింది. భాజపా 8 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క సీటూ సాధించలేకపోయినా మిగిలిన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో బలమైన ప్రాబల్యాన్ని ప్రదర్శించగలిగింది. మూడు రాష్ట్రాల్లో 60%కిపైగా, 10 రాష్ట్రాల్లో 50%కిపైగా ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించగలిగింది. సీట్లపరంగా అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో 90%కిపైగా గెలుచుకుని ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణల్లో కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటం తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే జతకట్టడం కొంత సానుకూలత కావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ 3 రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల కాంగ్రెస్ పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దిల్లీ, ఝార్ఖండ్లలో స్థానిక మిత్రపక్షాలైన ఆప్, జేఎంఎంలపై ఆధారపడగా.. ప్రస్తుతం ఆ రెండు పార్టీల ముఖ్య నేతలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ జైల్లో ఉండటం కూటమికి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల తర్వాత భాజపా కూటమిపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నా తర్వాత పరిస్థితులను సరిదిద్దుకుంది. బిహార్లో నీతీశ్ కుమార్, చిరాగ్ పాసవాన్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబులను కూటమిలో చేర్చుకుని పూర్వబలాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు నేతలను అక్కున చేర్చుకుని అక్కడ కొంతమేర నష్ట నివారణ చేసుకునే ఎత్తులు వేసింది. ప్రస్తుతం ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఉత్తర్ ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్, బిహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడులో ఎంకే స్టాలిన్ల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ బలంగా ఎదుర్కొనే పరిస్థితి ఒక్క కేరళలో తప్పితే ఎక్కడా కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?