ఏపీ ఓటర్లపై అక్కడి పార్టీల కన్ను
ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధానపార్టీల అభ్యర్థుల్లో కొందరు హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నారు.
హైదరాబాద్లో స్థిరపడిన వారితో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు
పోలింగ్ నాటికి రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు
ఈనాడు- హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధానపార్టీల అభ్యర్థుల్లో కొందరు హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నారు. మహానగరంలో స్థిరపడిన లక్షలమంది ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. తెదేపా, వైకాపా అభ్యర్థులు కొందరు ఇప్పటికే సమావేశాలు నిర్వహించగా.. మరికొందరూ ఇదే బాటలో ఉన్నారు. మే 13న పోలింగ్ ఉండటంతో అప్పటికి వారిని అక్కడకు తీసుకెళ్లేందుకు బస్సులు, రైళ్లలో టికెట్లు బుక్ చేస్తున్నారు. మహానగరంలో కొన్ని లక్షల మంది ఆంధ్రా ఓటర్లు ఉంటున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, ఎల్బీ నగర్ తదితర నియోజకవర్గాల పరిధిలో వీరు నివాసం ఉంటున్నారు. ఏపీలోని అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో వీరి ఓట్లు కీలకమని భావిస్తున్నారు.
ప్రసన్నానికి ప్రయత్నాలు..
ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ సంఘాలు, కమిటీలు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం తరఫున సీబీఎన్ ఆర్మీ ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఈ ఆర్మీ నగరంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు అదే సైన్యం తరఫున ఉపసంఘాలను నియమించారు. ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వీరు వెళ్లి చంద్రబాబు పాలన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఓటర్లను ఆయా నియోజకవర్గాలకు తీసుకెళ్లేందుకు బస్సులు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్ భవన్లో ఇటీవల ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. పర్చూరు నియోజకవర్గ ఓటర్ల ఆత్మీయ సమావేశం వారం రోజుల క్రితం జరిగింది. అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పాల్గొని రాజధానిలో స్థిరపడిన ఏపీ ఓటర్లతో మాట్లాడారు. ఇదే తరహాలో వైకాపా అభ్యర్థులు కూడా వరుసగా ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాశ్, కొత్తపేట వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తమ తమ నియోజకవర్గ ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న కూకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఓ సమావేశం నిర్వహించడానికి వైకాపా ఏర్పాట్లు చేస్తోంది. ఒంగోలు లోక్సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శాసనసభకు పోటీచేస్తున్న ఆ పార్టీకి చెందిన పదిమంది అభ్యర్థులు ఇందులో పాల్గొనబోతున్నారు. తెదేపా సైతం మరో పదిరోజుల్లో భారీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. జనసేన తరఫున ఈ సమావేశాల నిర్వహణకు ఆ పార్టీ అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. -
జేఎంఎం నుంచి సీతా సోరెన్ బహిష్కరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) శుక్రవారం ప్రకటించింది. -
నాలుగో దశలో 4 రాష్ట్రాల్లో మహిళల పోలింగే ఎక్కువ
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో నాలుగు రాష్ట్రాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే కొంత అధికంగా పోలింగ్కు తరలివచ్చారని ఎన్నికల సంఘం తెలిపింది. -
ఉత్తరాన తీవ్ర ఉత్కంఠ!
లఖ్నవూ, రాయ్బరేలీ నుంచి నీరేంద్ర దేవ్ఉత్తర్ ప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ఎన్నికల ప్రక్రియలో సీఎస్ జోక్యంతోనే హింసాకాండ
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జోక్యం వల్లే పోలింగ్ ప్రశాంతంగా జరపడంలో యంత్రాంగం విఫలమైందని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?