‘మధ్య’భారత పోరాటం
కేంద్రంలో అధికారం సాధించడానికి అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత రెండు ఎన్నికల్లో దాదాపుగా క్లీన్స్వీప్ చేసిన భాజపా.. ఈసారీ సగర్వంగా సర్వం సాధించాలని చూస్తోంది.
సగర్వంగా సర్వం సాధించాలని భాజపా
గౌరవం దక్కించుకోవాలని కాంగ్రెస్
కేంద్రంలో అధికారం సాధించడానికి అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత రెండు ఎన్నికల్లో దాదాపుగా క్లీన్స్వీప్ చేసిన భాజపా.. ఈసారీ సగర్వంగా సర్వం సాధించాలని చూస్తోంది. మరోవైపు గౌరవప్రదమైన సీట్లు సాధించి పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పోరాడుతోంది. రాష్ట్రంలోని 29 స్థానాలకు నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 19, 26, మే 7, 13 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. జాతీయ రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యముంటుంది. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత ఈ రాష్ట్రంలో అధిక సీట్లు సాధిస్తే అధికారం దక్కుతుందని భావిస్తారు.
తిరుగులేని భాజపా
గత రెండు లోక్సభ ఎన్నికల్లో భాజపా తిరుగులేని విజయాలను సాధించింది. 2014లో 27 సీట్లను గెలుచుకుంది. 2019లో 28 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్కు ఒక్క సీటే దక్కింది. అదీ కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ గెలుచుకుందే.
- 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాల్లో 163 గెలుచుకుని భాజపా చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితమైంది.
- 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా 61.2 శాతం ఓట్లను సాధించింది.
- కాంగ్రెస్ 35.8 శాతం ఓట్లనే సాధించగలిగింది.
- ఈసారి భాజపా 29 సీట్లలో పోటీ చేస్తోంది.
- భాజపా మోదీ ప్రభను, రామ మందిరం అంశాలను నమ్ముకుంది.
కాంగ్రెస్కూ గట్టి పట్టే
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కూ గట్టి పట్టే ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ను చీల్చి భాజపా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2019 ఎన్నికల నాటికి ఒక లోక్సభ సీటుకే కాంగ్రెస్ పరిమితమైంది.
- గత రెండు లోక్సభ, గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన కాంగ్రెస్.. ఈసారి గౌరవప్రదమైన సీట్లు సాధించడం కత్తిమీద సామే. జ్యోతిరాదిత్య సింధియా లాంటి సీనియర్లు పార్టీని వీడి వెళ్లడం దెబ్బే.
- ఈసారి కాంగ్రెస్ 28 సీట్లలో పోటీ చేస్తోంది. ఒక సీటును భాగస్వామి సమాజ్వాదీ పార్టీకి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ కుల గణన, రిజర్వేషన్ల పెంపు వంటి వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది.
మోదీ హవా
మధ్యప్రదేశ్లో మోదీ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో కాంగ్రెస్ను గెలిపించిన ఓటర్లు జాతీయ స్థాయిలో మాత్రం మోదీకే మద్దతుగా నిలిచారు. 2014, 2019లలో మోదీ అసమాన విజయాలు సాధించారు. అందుకే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక శివరాజ్సింగ్ చౌహాన్ను కాదని, మోహన్ యాదవ్ లాంటి కొత్త నేతను సీఎంని చేశారు. తద్వారా రాష్ట్రంలో మోదీ ప్రభావమే అధికంగా ఉందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నాన్ని భాజపా అధిష్ఠానం చేసింది. ఇక రామ మందిరం అంశం ఎలాగూ ఉంది.
తొలి విడతలో..
మధ్యప్రదేశ్లో తొలి విడతలో 6 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 88 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 19వ తేదీన పోలింగ్ జరగనుంది.
- తొలి విడత ఎన్నికలు జరిగే వాటిలో సీధీ, శహడోల్, జబల్పుర్, మాండ్లా, బాలాఘాట్, ఛింద్వాడా ఉన్నాయి.
- ఛింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు సిటింగ్ ఎంపీ నకుల్నాథ్ పోటీ చేస్తున్నారు. ఆయనతో భాజపా నుంచి వివేక్ బంటీ సాహు తలపడుతున్నారు.
- కేంద్ర మంత్రి ఫగన్సింగ్ కులస్థే మాండ్లా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్.. ఓంకార్ సింగ్ మార్కంను నిలిపింది.
- జబల్పుర్లో భాజపా నుంచి ఆశిష్ దూబే, కాంగ్రెస్ నుంచి దినేశ్ యాదవ్ తలపడుతున్నారు.
- సీధీలో భాజపా తరఫున రాజేశ్ మిశ్ర, కాంగ్రెస్ తరఫున కమలేశ్వర్ పటేల్ పోటీ చేస్తున్నారు.
- శహడోల్లో భాజపా నుంచి హిమాద్రి సింగ్, కాంగ్రెస్ నుంచి ఫుండేలాల్ మార్కో పోటీ చేస్తున్నారు.
- బాలాఘాట్లో భాజపా తరఫున భారతీ పార్దీ, కాంగ్రెస్ తరఫున సామ్రాట్ సింగ్ పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఆశ
ఉత్తర భారతంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంది. ముఖ్యంగా సైన్యంలో తాత్కాలిక నియామకాలపట్ల అక్కడి యువత అసహనంగా ఉంది. ఇది తనకు కలిసివచ్చే అవకాశముందని కాంగ్రెస్ భావిస్తోంది.
- ధరల పెరుగుదల అంశమూ ప్రజలను ఇబ్బంది పెడుతోంది.
- కాంగ్రెస్ సీనియర్లు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లాంటి నేతల ప్రాభవం ఏమన్నా మేలు చేస్తుందేమోనని ఆశిస్తోంది. దీనివల్ల కొన్ని సీట్లయినా గెలుచుకోవాలని తలపోస్తోంది.
మొత్తం సీట్లు: 29
రిజర్వుడు సీట్లు: 10
జనరల్: 19
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్