Prathipati PullaRao: ఓటమి భయంతోనే సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు: ప్రత్తిపాటి

ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

Updated : 29 Feb 2024 18:15 IST

పల్నాడు: ఓటమి భయంతో సీఎం జగన్ రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తప్పుడు కేసులతో ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కంపెనీలో డైరెక్టర్‌గా, కనీసం షేర్ హోల్డర్ కూడా కాని తన కుమారుడు శరత్‌పై.. కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘన కేసులు పెట్టారన్నారు. తన కుమారుడి అరెస్టు నేపథ్యంలో చిలకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘తెదేపా తరఫున నాకు చిలకలూరిపేట సీటు ఖరారు చేసిన రోజు సాయంత్రమే కేసు నమోదు చేశారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇలాగే బురదజల్లాలని చూశారు. ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పన్నినట్లు కనిపిస్తోంది. మాకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ప్రత్తిపాటి కుటుంబానికి ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడానికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయపరంగానే ఎదుర్కొంటాం. చిలకలూరిపేటలో పోటీకి వైకాపాకు అభ్యర్థులు దొరక్కట్లేదు’’ అని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని