PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారైంది.

Updated : 15 Mar 2024 16:52 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే ఒక దఫా తెలంగాణలో పర్యటించిన ప్రధాని.. ఈ నెల 15, 16, 18 తేదీల్లో మరోసారి పర్యటించనున్నారు.  15న మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో భారీ రోడ్‌ షో నిర్వహించాలని భాజపా రాష్ట్ర నాయకత్వం ప్లాన్‌ చేస్తోంది. దాదాపు గంటన్నరకు పైగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. అమిత్ షా సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు సమావేశమై రోడ్ షో విజయవంతంపై చర్చించారు. బుధవారం రాష్ట్ర కార్యాలయంలో మల్కాజిగిరి రోడ్ షోపై సన్నాహక సమావేశం జరగనుంది. 16న నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో, 18న జగిత్యాలలో మోదీ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని