Guntur: ఎన్నికల ప్రచారంలో నాదెండ్ల.. జనసేన నేత వాహనంపై దాడి

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో జనసేన నేత  కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Published : 20 Mar 2024 21:12 IST

తెనాలి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా దాడులు ఆగడం లేదు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో జనసేన నేత  కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుధవారం వల్లభాపురం గ్రామంలో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలతో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సమావేశమయ్యారు. మీటింగ్‌ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో నిలిపి ఉంచిన భీమవరపు వేణుగోపాల్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వాహనాన్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్‌.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నేతలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని