T20 League : ఈ కెరటాలు మళ్లీ ఎగసేనా.?
వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటే ఫ్యాన్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. అందులో ఎలాంటి
గత సీజన్లో పెద్దగా రాణించని ఆటగాళ్లు వీరే..
వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటే ఫ్యాన్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల సత్తా.. చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు.. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈ లెక్కలు చూసే కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ ఫ్రాంచైజీలు వారిని కొనుగోలు చేశాయి. అయినా ఏం లాభం..? ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అన్నట్టుగా గత సీజన్లో వారి ప్రదర్శన చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అయినప్పటికీ త్వరలో ప్రారంభం కానున్న మెగా టోర్నీలోనూ చూపులన్నీ వారిపైనే.!
బౌన్స్ బ్యాక్ అవుతాడా..?
తన సారథ్యంలో హైదరాబాద్కు ట్రోఫీని తెచ్చిపెట్టిన ఘనుడు డేవిడ్ వార్నర్. 848, 641, 692, 548.. వంటి భారీ పరుగులతో పలు సీజన్లలో మెరిసిన వార్నర్.. 2021 ఏడాదిలో మాత్రం పరుగుల కోసం చాలా కష్టాలే పడ్డాడు. ఆ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన వార్నర్ కేవలం 195 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసినప్పటికీ బ్యాటింగ్ సగటు 24.37గా ఉండటం గమనార్హం. అయితే, ఏ కారణం లేకుండా హైదరాబాద్ జట్టు నుంచి తప్పించడం, కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం బాధించాయని సీజన్ తర్వాత వార్నర్ వాపోయాడు. అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్లో అతడు 289 పరుగులతో చెలరేగి.. ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే.. ఈసారి మెగా వేలంలో వార్నర్ను దిల్లీ రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది. మెగా టోర్నీలో ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చానని వార్నర్ ఇటీవల సంతోషం వ్యక్తం చేశారు. మరి మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే 15వ సీజన్లో ఈ స్టార్ బ్యాటర్ ఎలా విజృంభిస్తాడో.?చూడాలి.
మిస్టర్ కూల్ కూడా..!
అంతర్జాతీయ క్రికెట్కి గుడ్బై చెప్పిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి గత సీజన్ మొదటిది. తన సారథ్యంలో 2021 ఏడాదిలో జట్టుకు మరో కప్పు అందిచినప్పటికీ వ్యక్తిగతంగా ధోనీ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. 2021లో మొత్తం 16 మ్యాచ్ల్లో 14 ఇన్నింగ్స్లు ఆడిన ధోనీ 106.54 స్ట్రైక్ రేట్తో కేవలం 114 పరుగులే చేశాడు. మిడిలార్డర్లో వచ్చినప్పటికీ ధోనీ అత్యధిక పరుగులు 18 నాటౌట్గా ఉండటం గమనార్హం. అయితే, కెరీర్లో అత్యంత విజయమంతమైన ధోనీని ఈ లెక్కలు చూసి ఓ అంచనా వేయలేం విపత్కర పరిస్థితుల్లోనూ తన ఆలోచన శక్తితో జట్టును విజయ తీరాలకు చేర్చే సత్తా ఈ మహేంద్రుడికే చెల్లుతుంది. అందువల్లే ఈ సీజన్లో ధోనీని వేలంలో వదులుకోకుండా కెప్టెన్గా అంటిపెట్టుకుంది చెన్నై.
హార్దిక్ నడిపిస్తాడా..?
ఫామ్లేమితో గత రెండేళ్లుగా క్రికెట్కు దూరమైన టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఈ సీజన్లో కొత్త జట్టు గుజరాత్కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇన్నాళ్లు ముంబయిలో పేస్-ఆల్ రౌండర్గా ఉన్న హార్దిక్.. గతేడాది పెద్దగా రాణించలేదు. మొత్తంగా 12 మ్యాచ్ల్లో 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 127 పరుగులే చేశాడు. జట్టులో ఆల్రౌండర్గా ఉన్నప్పటికీ గత రెండు సీజన్లలో హార్దిక్ బౌలింగ్పై ముంబయి ఎప్పుడూ ఆధారపడలేదు. అయితే, ప్రస్తుతం బాగా సన్నద్ధమయ్యానని గ్యారంటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ముంబయి జట్టులో కీలక ఆల్రౌండర్గా వెలుగొందిన హార్దిక్.. ప్రస్తుత సీజన్లో కొత్త జట్టును ఎలా నడిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
నికోలస్ లెక్క తప్పలేదా..!
టీ20 క్రికెట్లో విధ్వంసకర పవర్ హిట్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్. గతేడాది పంజాబ్ తరఫున ఆడిన ఇతడు నాలుగు సార్లు డకౌటై చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. పైగా 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్లు ఆడి 85 పరుగులే చేశాడు. దీంతో ఈసారి పూరన్ను పంజాబ్ వదులుకుంది. అయినా, వేలంలో విండీస్ ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 2022 వేలంలో రూ.10.75 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ మేరకు తన లెక్క తప్ప లేదని ఇటీవల టీమ్ఇండియాతో జరిగిన టీ20 సిరీస్లో విధ్వంసర బ్యాటింగ్తో బదులు చెప్పాడు నికోలస్.
అయినా ఖరీదైన ఆటగాడిగా..
ముంబయి టాప్-ఆర్డర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా గతేడాది 10 మ్యాచుల్లో కేవలం 241 పరుగులే చేశాడు. అదనపు బౌలర్ను ఆడించడానికి పలు సందర్భాల్లో ఇషాన్ను జట్టు పక్కన పెట్టాల్సి వచ్చింది. దీని బట్టి అతడు గతేడాది పెద్దగా రాణించలేదనే చెప్పాలి. అయినప్పటికీ 2022 మెగా వేలంలో ముంబయి రూ.15.25 కోట్లతో ఇషాన్ కిషన్ని దక్కించుకుంది. దీంతో మెగా టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మరికొందరు..
* పేపర్పై విజయ్ శంకర్ మంచి ఆటగాడే. డెత్ ఓవర్లలో ఫినిషింగ్ బ్యాటర్గా రాణించగలడనే పేరుంది. దాంతో పాటు ఫీల్డింగ్, బౌలింగ్ల్లోనూ సత్తా చాటగలడు. అయితే, గత సీజన్లలో హైదరాబాద్ తరఫున ఆడిన విజయ్ పూర్తిగా నిరాశ పరిచాడు. 7 మ్యాచుల్లో కేవలం 28 పరుగులే చేశాడు. తాజాగా గుజరాత్ రూ.1.40 కోట్లకు ఇతడిని కొనుగోలు చేసింది.
* 2020 గతేడాది రాజస్థాన్ జట్టులో ఆల్రౌండర్గా రాహుల్ తెవాటియా అందరి దృష్టి ఆకర్షించాడు. కానీ, 2021 సీజన్లో మాత్రం పెద్దగా రాణించలేదు. 14 మ్యాచుల్లో 8 వికెట్లు, 11 ఇన్నింగ్స్ల్లో 155 పరుగులే చేశాడు. ఈసారి గుజరాత్ తెవాటియాను రూ.9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది.
* గతేడాది దిల్లీ తరఫున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 13 మ్యాచుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. తాజా మెగా వేలంలో అశ్విన్ను రాజస్థాన్రూ .5 కోట్లకు కొనుగోలు చేసింది.
* హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ 11 మ్యాచుల్లో ఆరు వికెట్లే పడగొట్టాడు. అయినా ఈ రికార్డును పక్కనపెట్టింది హైదారాబాద్ యాజమాన్యం. 2022 మెగా వేలంలో రూ.4.2 కోట్లతో తిరిగి భువీని వెనక్కి తీసుకుంది.
* ముంబయి తరఫున ఆడిన కృనాల్ పాండ్య 13 మ్యాచుల్లో.. 12 ఇన్నింగ్స్ల్లో ఆడి కేవలం 140 పరుగులు చేసి, ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇక ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. మైదానంలో అడుగు పెట్టాక అవన్నీ తారుమారు అవుతాయి. గత సీజన్ లెక్కలే ఇందుకో ఉదాహరణ. ఒక సీజన్లో పేలవ ప్రదర్శన చేసినంతా మాత్రానా ఆటగాళ్ల ఆటతీరులో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా పడిన వాళ్లే ఎన్నోసార్లు బౌన్స్ బ్యాకై చరిత్ర సృష్టించారు. అందువల్లే ఒక సీజన్ లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ఆటగాళ్ల దీర్ఘకాలిక ఆట తీరును బట్టే ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు చెల్లిస్తుంటాయనేది విదితమే.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్