ఆ సంబరాలు ఆమె కోసమే
అంతర్జాతీయ కెరీర్ను గొప్పగా ఆరంభించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్వర్మ.. విండీస్తో రెండో టీ20లో తొలి అర్ధశతకం అందుకున్నాడు.
ప్రావిడెన్స్ (గయానా): అంతర్జాతీయ కెరీర్ను గొప్పగా ఆరంభించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్వర్మ.. విండీస్తో రెండో టీ20లో తొలి అర్ధశతకం అందుకున్నాడు. ఈ మైలురాయి చేరుకున్న తర్వాత.. రెండు చేతులూ ఆడిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ సంబరాలు సమైరా (రోహిత్ శర్మ తనయ)కు అంకితమని మ్యాచ్ తర్వాత తిలక్ వెల్లడించాడు. ‘‘ఆ సంబరాలు రోహిత్ తనయ సమ్మీ (సమైరా) కోసమే. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు సెంచరీ లేదా అర్ధసెంచరీ సాధించినా ఆమె కోసమే సంబరాలు చేసుకుంటానని తనకు మాటిచ్చా’’ అని అతను చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ను ఇంత గొప్పగా ప్రారంభించడం వెనుక రోహిత్ శర్మది కీలక పాత్ర అని తిలక్ పేర్కొన్నాడు. ‘‘రోహిత్ భాయ్ నాకెప్పుడూ మద్దతుగా నిలుస్తాడు. ఆటను ఆస్వాదించమంటాడు. ఎలా ఆడాలో చెబుతాడు. చిన్నప్పటి నుంచి రైనా, రోహిత్ నాకు స్ఫూర్తి. రోహిత్తో చాలా సమయం గడుపుతా. నా మొదటి ఐపీఎల్ సీజన్ అప్పుడు ‘తిలక్ అన్ని ఫార్మాట్ల ఆటగాడు’ అని రోహిత్ చెప్పడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంతర్జాతీయ క్రికెట్ అంత సులభం కాదు. మనుగడ సాగించాలంటే నిలకడగా రాణించాల్సిందే. మైదానం బయట, లోపల క్రమశిక్షణతో ఉండాలి. పని తీరులోనూ క్రమశిక్షణ అవసరం. నిరంతర ప్రక్రియగా ఇదంతా చేస్తూంటే మంచి ఫలితాలు వస్తాయి. నేనాడిన ఐపీఎల్ రెండు సీజన్లే నా కెరీర్లో మలుపు. ఆ ప్రదర్శనతోనే టీమ్ఇండియా నుంచి పిలుపొచ్చింది. అదే ప్రదర్శనను కొనసాగిస్తున్నా. అండర్-19 ప్రపంచకప్ నుంచి కోచ్ ద్రవిడ్ సర్తో మాట్లాడుతూనే ఉన్నా. ప్రాథమిక అంశాలను అనుసరిస్తూ, క్రీజులో ఎక్కువ సమయం గడపాలని ద్రవిడ్ చెబుతుంటాడు’’ అని అతను తెలిపాడు. విండీస్తో రెండో టీ20లో తిలక్ 51 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కానీ జట్టు 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ‘‘ఆ పిచ్ మందకొడిగా ఉంది. రెండు రకాలుగా స్పందించింది. 150-160 మంచి స్కోరే అనుకున్నాం. కానీ తర్వాత ఓ 10 పరుగులు తక్కువ చేశామనిపించింది. ఉత్తమంగా బ్యాటింగ్ చేసిన పూరన్కు ఘనత దక్కాలి. ఒక్క వికెట్ దక్కితే చాలు గెలుస్తామనిపించింది. ఎందుకంటే పిచ్ అంత మందకొడిగా ఉంది. వెస్టిండీస్ మెరుగ్గా బౌలింగ్ చేసింది. గాలి పరిస్థితి, పిచ్ను చక్కగా ఉపయోగించుకుని ఆ బౌలర్లు బంతులేశారు’’ అని తిలక్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా ‘ఫైనల్’ ప్రత్యర్థి ఎవరు? గాయపడ్డ హైదరాబాదా.. జోరు మీదున్న రాజస్థానా?
శుక్రవారం చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు చేరి కోల్కతాను ఢీకొట్టనుంది. -
షారుక్ ఖాన్ ఐపీఎల్ ఫైనల్కు వచ్చేస్తాడు: జూహీ చావ్లా
కోల్కతా ఓనర్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సహ యజమాని జూహీ చావ్లా స్పందించారు. -
పొత్తికడుపు గాయంతో బాధపడ్డా.. వయసు పెరుగుతోంది కదా: అశ్విన్
ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును చిత్తు చేసి రాజస్థాన్ రెండో క్వాలిఫయర్లో అడుగు పెట్టింది. ఆర్ఆర్ విజయంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. -
‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
కీలకమైన మ్యాచ్లో ఓడిన బెంగళూరు జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆ ఫ్రాంచైజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ కూడా మెగా లీగ్కు వీడ్కోలు పలికాడు. -
మా స్పెషాలిటీ చూపించలేకపోయాం.. ‘ఇంపాక్ట్’ రూల్తో ఆ స్కోరు సరిపోదు: డుప్లెసిస్
Bengaluru Vs Rajasthan: కీలక ఎలిమినేటర్లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకొచ్చింది. ఈ సందర్భంగా తమ ప్లేయర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ డుప్లెసిస్ మరో 20 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
దినేశ్ కార్తిక్.. ఆ ఎల్బీ నాటౌటా?
ఆర్సీబీ ఇన్నింగ్స్లో సమీక్షలో దినేశ్ కార్తీక్ ఎల్బీ నాటౌట్గా తేలడం వివాదాస్పదమైంది. 15వ ఓవర్ రెండో బంతికి రజత్ను అవేశ్ ఔట్ చేశాడు. -
నేనైతే మొదట కోహ్లినే ఎంపిక చేస్తా
విరాట్ కోహ్లిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి భారత్లో జనం కారణాలు వెతుకుతారని, తానైతే టీ20 ప్రపంచకప్కు మొదట అతణ్నే ఎంచుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. -
ఐపీఎల్కు కార్తీక్ టాటా
వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆ మ్యాచ్ అయిన వెంటనే కార్తీక్ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. -
ఈ సాలా కన్నీళ్లే!
ఐపీఎల్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం ఎలిమినేటర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. -
తుదిపోరుకు జ్యోతి బృందం
ఆర్చరీ ప్రపంచకప్ల్లో ప్రపంచ నంబర్వన్ భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామి త్రయం.. తాజాగా రెండో అంచె పోటీల్లోనూ ఫైనల్కు దూసుకెళ్లింది. -
సచిన్ రికార్డు స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు. -
రెండో రౌండ్లో సింధు
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు శుభారంభం చేసింది. -
కోహ్లి మూడులోనే..
ఆర్సీబీ ఓపెనర్గా ఐపీఎల్లో కోహ్లి గొప్ప ప్రదర్శన చేశాడు. కానీ వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్లో అతణ్ని మూడో స్థానంలో ఆడించడమే మంచిదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ గ్రేట్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. -
అర్జెంటీనాపై భారత్ విజయం
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఐరోపా అంచెను భారత పురుషుల జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో షూటౌట్లో 5-4తో అర్జెంటీనాను ఓడించింది. -
పంత్ ఉంటేనే బాగుంటుంది
టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ కన్నా రిషబ్ పంతే వికెట్ కీపర్గా ఉంటే బాగుంటుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
నాపై ఒత్తిడేమీ ఉండదు: ప్రజ్ఞానంద
నార్వే చెస్ టోర్నమెంట్ సందర్భంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను అతడి సొంతగడ్డపై ఎదుర్కొనేటప్పుడు తనపై ఒత్తిడేమీ ఉండదని ప్రజ్ఞానంద అన్నాడు. -
దేశం ఆర్థిక కష్టాల్లో ఉంటే.. కరెన్సీతో ‘పాక్ క్రికెటర్’ ఆటలు!
ఓ పాకిస్థాన్ యువ క్రికెటర్..తన చేతిలో ఉన్న డాలర్లతో నుదుటిమీద చెమటను తుడుచుకోవడం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం.. నరసరావుపేటలో పోలీసుల పహారా
-
గూగుల్పేలో బై నౌ పే లేటర్.. కార్డు వివరాలు మరింత సేఫ్
-
బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలోకి అదానీ ఎంటర్ప్రైజెస్?
-
తెలంగాణ జిల్లాల్లో రెండు రోజులపాటు వర్షాలు
-
పిన్నెల్లిని త్వరలోనే అరెస్టు చేసి తీరుతాం: సీఈవో ఎంకే మీనా
-
మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వం!