Stock market: సెన్సెక్స్, నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్.. సూచీల లాభాల పరుగుకు కారణాలు ఇవే..!
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు.. ఆర్బీఐ డివిడెండ్, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ దాదాపు 1200 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 74,253.53 పాయింట్ల (క్రితం ముగింపు 74,221.06) వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. తర్వాత లాభాల జోరు మొదలైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 75,499.91 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను అందుకుంది. చివరికి 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,993.60 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి.
కారణాలు ఇవే..
-
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అంచనాలను మించి ఆర్బీఐ తాజాగా కేంద్రానికి డివిడెండ్ ప్రకటించడం సూచీల పరుగుకు కారణమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.2.11 లక్షల కోట్లను ఆర్బీఐ ప్రభుత్వానికి అందించనుంది. ఈ మొత్తం కేంద్రం తన ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి ఉపయోగపడనుంది. ఆర్బీఐ నుంచి రూ.లక్ష కోట్లు వస్తాయని మార్కెట్ ముందుగా అంచనా వేసింది. అంతకు డబుల్ డివిడెండ్ ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని కేంద్రం వినియోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. తొలినాళ్లలో పోలింగ్ తగ్గడం మదుపర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఐదు దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మరోసారి స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడొచ్చన్న అంచనాలు బలపడడం మదుపరుల్లో ఉత్సాహం నింపింది. ఇదే ఆందోళనలతో విదేశీ సంస్థాగత మదుపర్లు సైతం అమ్మకాలకు దిగారు. తాజాగా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లకు దిగడం సూచీల పరుగుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజాగా హెచ్ఎస్బీసీ వెలువరించిన డేటా కూడా సూచీలు రాణించడానికి మరో కారణం. దేశంలో ఎగుమతులు పెరిగాయని, మే నెలలో ఉద్యోగ కల్పన 18 ఏళ్ల గరిష్ఠానికి చేరడమూ మరో పాజిటివ్ అంశమని నిపుణులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి? -
వాణిజ్య రహస్యాలు దుర్వినియోగం కేసు.. టీసీఎస్కు ₹1,600 కోట్లు జరిమానా
TCS: వాణిజ్య రహస్యాలు బయటపెట్టారన్న కారణంతో అమెరికా డిస్ట్రిక్ కోర్ట్ టీసీఎస్కు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించింది. -
రుణ రేట్లను సవరించిన SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. MCLRను ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధులకు 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. -
56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్
భారీ వేతన ప్యాకేజీకి ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపిన నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) సంతోషంతో డ్యాన్స్ చేశారు. -
‘మౌస్ జిగ్లింగ్’ చేస్తున్నారని ఉద్యోగులపై కంపెనీ వేటు.. ఇంతకీ ఏంటిది?
Wells Fargo: మౌస్ జిగ్లింగ్ అంటే ఏంటి? ఈ చర్యకు పాల్పడిన వారిని వెల్స్ ఫార్గో ఎందుకు తొలగించింది? -
ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. సెబీకి పత్రాల సమర్పణ
Hyundai IPO: ఐపీఓ కోసం హ్యుందాయ్ మోటార్ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. ఆమోదం లభించడమే తరువాయి. -
మైక్రోసాఫ్ట్ విజయం వెనుక భారత్.. కొనియాడిన బిల్గేట్స్
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్తో తనకున్న అనుబంధం గురించి మరోసారి గుర్తుకుతెచ్చుకున్నారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. -
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
Caller ID : ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు అవతలి వ్యక్తుల పేర్లు డిస్ప్లే అయ్యే కాలర్ ఐడీ సేవలపై టెలికాం కంపెనీలు పరిమిత స్థాయిలో ప్రయోగాలను ప్రారంభించాయి. -
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డ్లు కొనుగోలు చేయొచ్చు..?
SIM Cards: మీ ఆధార్ నంబర్తో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? అసలు ఒక్క ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయొచ్చు? -
ఎక్కువ చెల్లించాం.. తిరిగి ఇచ్చేసేయండి: మాజీ ఉద్యోగులకు మస్క్ హెచ్చరిక..!
తొలగించిన ఉద్యోగులకు అధికమొత్తం చెల్లించామని, దానిని వారు వెంటనే తిరిగి ఇచ్చేయాలని మాజీ ఉద్యోగులకు ‘ఎక్స్’ నుంచి మెయిల్ వెళ్లింది. -
హ్యుందాయ్ రూ.25,000 కోట్ల ఐపీఓ
దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ తన భారత విభాగాన్ని పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కు తీసుకురానుంది. కనీసం 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరణ నిమిత్తం త్వరలోనే మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. -
రిటైల్ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్ జాగ్రత్త
చిన్న మదుపర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్కు దూరంగా ఉండాలని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు. -
7 నెలల గరిష్ఠానికి దేశ వాణిజ్య లోటు
మేలో భారత ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 7.7 శాతం అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ఠమైన 23.78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
15 నెలల గరిష్ఠానికి టోకు ధరలు
మే నెలలో టోకు ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. తయారీ ఉత్పత్తులు ప్రియం కావడం కూడా మరో కారణమని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
దేశీయ విమాన ప్రయాణికులు 1.37 కోట్లు
ఈ ఏడాది మే నెలలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.37 కోట్లుగా నమోదైనట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం వెల్లడించింది. 2023 మేలో ప్రయాణించిన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 4.4 శాతం ఎక్కువ. -
భారత్ అధిక వృద్ధికి ఆ 3 ‘ప్రతికూలతలే’ అడ్డంకి
భారత్ వేగంగా వృద్ధి చెందేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రపంచీకరణ నెమ్మదించడం, ప్రపంచ రాజకీయాల్లో విభజన, వాతావరణంలో మార్పుల రూపంలో మూడు ‘ప్రతికూలతల’ను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. -
కొత్త పల్సర్ ఎన్ 160 ఆవిష్కరణ
బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్160లో కొత్త వేరియంట్ను ఆవిష్కరించింది. ఇందులో ఇపుడున్న ఫీచర్లకు తోడు టర్న్-బై-టర్న్ నేవిగేషన్ను తన బ్లూటూత్ ఆధారిత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్ గోల్డ్ 33 ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్స్ను సైతం కొత్తగా జత చేసింది. -
కొనసాగిన లాభాల జోరు
సూచీలు రికార్డుల జోరు కొనసాగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 83.55 వద్ద ముగిసింది. -
20,000 చిన్న సంస్థలకు రుణాల మంజూరు: ఎస్బీఐ
డిసెంబరులో ప్రారంభమైన డిజిటల్ రుణాల ప్రయోగాత్మక ప్రాజెక్ట్ భాగంగా చిన్న సంస్థలకు రూ.10-50 లక్షల వరకు దాదాపు 20,000 రుణాలు మంజూరు చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర రాణా తెలిపారు. -
ఆరోగ్య బీమాలోకి వచ్చే ప్రతిపాదనలు లేవు: ఎల్ఐసీ
ఆరోగ్య బీమా విభాగంలోకి రావాలనే ప్రతిపాదనలు ప్రస్తుతానికి లేవని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. -
జెన్ఏఐ అంకురాలకు రూ.2,000 కోట్ల సహకారం
జెనరేటివ్ ఏఐ అంకుర సంస్థలకు 230 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) మేర సహకారం అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూఎస్) తన ప్రణాళికగా పెట్టుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
-
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!