కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం.
మరో 3 రోజుల్లో ఐపీఎల్-17
ఈనాడు క్రీడావిభాగం
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. గత మూడు సీజన్లుగా అయితే మరింత పేలవ ప్రదర్శన.. ఇదీ మన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం. ఇప్పుడు కొత్త కెప్టెన్, కోచ్.. కోటి ఆశలతో మరో సీజన్కు సై అంటోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా సారథిగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న కమిన్స్.. ఆరెంజ్ ఆర్మీ రాత మారుస్తాడా? జట్టుకు రెండో ట్రోఫీ అందిస్తాడా?
ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ఆటతీరుతో, వివాదాలతో సాగుతోంది. సన్రైజర్స్కు ఆకర్షణ పెంచి, అభిమానులను అలరించిన వార్నర్ను వద్దనుకుని.. విలియమ్సన్ను కాదనుకుంది. దీంతో జట్టు ప్రతిష్ఠ కూడా మసకబారిందనే చెప్పాలి. వరుసగా సారథులను మారుస్తున్నా సరైన ఫలితాలు రాబట్టలేకపోయింది. 2021 నుంచి ప్రదర్శన మరింత దిగజారింది. ఆ ఏడాది చివరి స్థానంలో నిలిచింది. 2022లో 10 జట్ల పోరులో 8వ స్థానాన్ని దక్కించుకుంది. నిరుడు మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈ సారి విదేశీ ఆటగాళ్ల బలంతో, స్వదేశీ క్రికెటర్ల సత్తాతో 17వ సీజన్కు సిద్ధమైంది. నిరుడు ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్గా, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను వేలంలో ఏకంగా రూ.20.5 కోట్లకు సొంతం చేసుకుంది. అతనిపైనే ఆశలు పెట్టుకుని జట్టు పగ్గాలు అప్పగించింది. వార్నర్ సారథ్యంలో 2016లో కప్పును ముద్దాడిన సన్రైజర్స్ మరోసారి ఆస్ట్రేలియా ఆటగాడి సారథ్యంలో విజేతగా నిలుస్తుందేమో చూడాలి. కొత్త కోచ్ వెటోరితో కలిసి 8 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణకు కమిన్స్ ముగింపు పలకాలన్నది తెలుగు రాష్ట్రాల అభిమానుల ఆశ.
బలాలు: నాణ్యమైన విదేశీ ఆటగాళ్లు సన్రైజర్స్కు కొండంత బలం. కెప్టెన్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్, మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, క్లాసెన్, యాన్సెన్, హసరంగ, ఫజల్ హక్ ఫరూఖీ లాంటి విదేశీ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. పేస్ బౌలింగ్తో, బ్యాటింగ్తో సత్తాచాటే కమిన్స్ జట్టు కూర్పులో సమతూకం తెస్తాడు. ఇటీవల అతను సూపర్ ఫామ్లోనూ ఉన్నాడు. అతని నాయకత్వ నైపుణ్యాలపై ఎలాంటి సందేహాలు లేవు. హెడ్ ఎంతటి విధ్వంసక ఆటగాడో తెలిసిందే. ఈ ఏడాది టీ20ల్లో అతని స్ట్రైక్రేట్ 152 పైనే. ఇక మార్క్రమ్, ఫిలిప్స్, క్లాసెన్ కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. పేసర్ యాన్సెన్, స్పిన్నర్ హసరంగ.. బంతితోనే కాకుండా బ్యాట్తోనూ అదరగొడతారు. జట్టులోని భారత బౌలర్ల దళం కూడా పటిష్ఠంగా ఉంది. పేస్ త్రయం భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ నిలకడగా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. వాషింగ్టన్ సుందర్ నమ్మదగిన స్పిన్ ఆల్రౌండరే. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ కూడా సమతూకంగా కనిపిస్తోంది.
బలహీనతలు: భారత ఆటగాళ్ల అనుభవలేమి, ఫామ్ లేమి సన్రైజర్స్కు సమస్యగా మారుతోంది. అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్, వాషింగ్టన్ సుందర్ అంచనాలను అందుకోవాల్సి ఉంది. అలాగే జట్టులో సమష్టితత్వం కూడా కొరవడుతోంది. వ్యక్తిగతంగా ఆటగాళ్లు రాణిస్తున్నా.. జట్టుగా విఫలమవుతున్నారు. ఆటగాళ్లనూ సరిగా ఉపయోగించుకోలేకపోవడం కూడా దెబ్బతీస్తుందనే చెప్పాలి. వార్నర్, విలియమ్సన్, మార్క్రమ్, ఇప్పుడేమో కమిన్స్.. ఇలా సారథులను వరుసగా మారుస్తుండటంతో జట్టు సంస్కృతి, ప్రధాన ఆటగాళ్ల బృందం అంటూ లేకుండా పోయింది. మరోవైపు అంచనాల ఒత్తిడిని కమిన్స్ ఎలా ఎదుర్కుంటాడన్నది చూడాలి. ఐపీఎల్లో తొలిసారి అతనో జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో, వన్డేల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. టీ20ల్లో మాత్రం అంతంతమాత్రమే. జట్టును విజయాల బాటలో నడిపిస్తూ.. తిరిగి అభిమానుల మద్దతు సంపాదించాల్సిన భారం అతనిపై ఉంది. ఇక విదేశీ ఆటగాళ్ల నుంచి తుది జట్టులోకి నలుగురిని ఎంచుకోవడం కూడా సవాలే.
దేశీయ ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, జాతవేద్ సుబ్రహ్మణ్యన్, ఆకాశ్ సింగ్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కత్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే.
విదేశీయులు: కమిన్స్ (కెప్టెన్), మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మార్కో యాన్సెన్, హసరంగ, ఫజల్ హక్ ఫారూఖీ; కీలక ఆటగాళ్లు: కమిన్స్, హెడ్, హసరంగ, వాషింగ్టన్ సుందర్, క్లాసెన్.
ఉత్తమ ప్రదర్శన: 2016లో ఛాంపియన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్