సంక్షిప్త వార్తలు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఇకమీదట అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్గా జరుగనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. ఇక 5 టెస్టులు
దిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఇకమీదట అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్గా జరుగనుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల సిరీస్గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చినట్లు సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. 2024-25 సిరీస్ షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ‘‘1991-92 తర్వాత తొలిసారిగా భారత్, ఆసీస్లు అయిదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనున్నాయి. 2024-25 వేసవిలో ముఖ్యమైన టోర్నీగా నిలిచే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుంది’’ అని సీఏ పేర్కొంది.
అది సమష్టి నిర్ణయం: పొలార్డ్
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ దాడిని ఆరంభించడాన్ని ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ సమర్థించాడు. హార్దిక్ ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగడం సమష్టి నిర్ణయమని అన్నాడు. ‘‘ఒక జట్టుకు ఏం కావాలన్నది ప్రణాళిక రచించాలి. నిర్ణయాలు తీసుకోవాలి. హార్దిక్ గుజరాత్ తరఫున కూడా కొత్త బంతితో బౌలింగ్ చేశాడు. స్వింగ్ కూడా చేశాడు. స్వింగవుతున్న కొత్త బంతిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాం. మా నిర్ణయంలో తప్పు లేదు’’ అని పొలార్డ్ చెప్పాడు. ‘‘ఏ నిర్ణయం కూడా ఒక్కరు తీసుకున్నది కాదు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావడం అతడి నిర్ణయమని చెప్పలేం. జట్టుగా మాకు ప్రణాళికలు ఉన్నాయి’’ అని అన్నాడు.
జై షాతో ఇషాన్ మాటామంతి
అహ్మదాబాద్: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, బోర్డు కార్యదర్శి జై షా మధ్య సంభాషణ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ అనంతరం ముంబయి ఇండియన్స్ ఆటగాడు ఇషాన్తో షా మాటామంతి ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అలసట కారణంగా అర్ధంతరంగా తిరిగొచ్చిన ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఇష్టపడలేదు. భారత జట్టు మేనేజ్మెంట్ పదే పదే సూచనలు చేసినా రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి ఇషాన్ బరోడాలో ఐపీఎల్ కోసం సాధన చేసేందుకు మొగ్గు చూపాడు. రాజస్థాన్తో ఝార్ఖండ్ చివరి రంజీ మ్యాచ్ ఆడాలన్న బోర్డు సూచననూ పెడచెవిన పెట్టడంతో అతనికి సెంట్రల్ కాంట్రాక్టు దక్కలేదు. ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్శర్మ సమక్షంలో షాతో సరదా సంభాషణ ఇషాన్కు సానుకూల సంకేతమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
శుభ్మన్ కొత్త అనిపించలేదు: సాయికిశోర్
అహ్మదాబాద్: హార్దిక్ పాండ్య స్థానంలో ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ కొత్త సారథిగా నియమితుడైన శుభ్మన్ గిల్.. కెప్టెన్గా తన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో జట్టుకు మంచి ఆరంభాన్నివ్వడమే కాక.. అనంతరం కెప్టెన్గా బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలతో ముంబయికి చెక్ పెట్టాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబయి 169 పరుగుల ఛేదనలో విఫలం కావడంలో శుభ్మన్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో శుభ్మన్పై ఆ జట్టు స్పిన్నర్ సాయికిశోర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘గిల్ జట్టును గొప్పగా నడిపించాడు. అతను తొలిసారి సారథిగా వ్యవహరిస్తున్నట్లు అనిపించలేదు. ఒక స్పిన్నర్గా నాకు తన చిట్కాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మేం 10 పరుగులు తక్కువ చేశామనిపించింది. కానీ సమష్టిగా ఆడి గెలిచాం. పోరాటం మా తత్వం. గెలిచినా, ఓడినా మేం ఆడే తీరు పట్ల గర్విస్తాం. కోచ్ అశిష్ నెహ్రా ఇదే విషయం మాకు ఎప్పుడూ చెబుతుంటాడు. గత రెండేళ్లలో జట్టు తత్వాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర కీలకం’’ అని సాయికిశోర్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్