Bishan Singh Bedi: క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఇకలేరు
భారత క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్బేడీ (77) ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.
దిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. తన ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు. బిషన్ సింగ్ బేడీ భారత్ తరఫున 1966 నుంచి 1979 వరకు ఆడారు. 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశారు. బిషన్ సింగ్ బేడీ (Bishan singh Bedi) 22 మ్యాచ్లకు కెప్టెన్గానూ వ్యవహరించారు. 10 వన్డేల్లో ఆడి 7 వికెట్లు తీశారు. అప్పట్లో భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్లో తనదైన ముద్ర వేశారు. బిషన్సింగ్ బేడీ 1976లో పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
భారత్ తొలి వన్డే విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్. వెంకటరాఘవన్లతో కలసి కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్లో భాగంగా ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (12-8-6-1)తో ఆ జట్టును 120 పరుగులకే కట్టడి చేశారు. క్రికెట్లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో భారత క్రికెట్ జట్టుకు మేనేజర్గా ఉన్నారు. జాతీయ సెలెక్టర్గానే కాకుండా మణిందర్ సింగ్, మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు మెంటార్గా ఉన్నారు. 2004లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
బిషన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, ఖర్గే విచారం
ప్రముఖ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని.. తన స్పిన్ బౌలింగ్తో భారత్కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాల క్రికెటర్లకు ఆయన స్ఫూర్తిమంతంగా నిలుస్తారని పేర్కొన్నారు. బిషన్ సింగ్ బేడీ కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రికెట్ ప్రేమికులు 'ది సర్దార్ ఆఫ్ స్పిన్' అంటూ ముద్దుగా పిలుచుకొనే బిషన్ సింగ్ ప్రసిద్ధమైన క్రికెటర్లలో ఒకరని, ఆయన మరణ వార్త చాలా బాధించిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. క్రీడా రంగానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరోవైపు, బిషన్ సింగ్ బేడీ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేయడంతో పాటు ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. బిషన్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్, బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, ఇర్ఫాన్ పఠాన్తో పాటు పలువురు ప్రముఖులు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్టులు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నా.. సంజూ శాంసన్ క్యాచ్ ఔట్పై మాత్రం చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్కు వెళితే ఏదైనా సాధ్యమేనని గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు. -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం లఖ్నవూ కెప్టెన్పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. అంతకుముందు కోల్కతా చేతిలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. -
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ పంజాబ్తో బెంగళూరు తలపడనుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి మరోసారి మంచి ఇన్నింగ్స్ రావాలని అతడి అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను కాదని ముంబయి హార్దిక్ను కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు. -
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
తమ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ చేతిలో ఓటమిపాలు కావడం లఖ్నవూ ఫ్రాంచైజీ యజమానికి తీవ్ర అసహనం తెప్పించింది. దానిని కెప్టెన్ కేఎల్ రాహుల్పై చూపించడం నెట్టింట వైరల్గా మారింది. -
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
ముంబయి ఇండియన్స్లో హార్దిక్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఆటగాళ్లు తమ అభిప్రాయాలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చారు. -
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
గత మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోని హైదరాబాద్ ఓపెనర్లు మళ్లీ విజృంభించారు. ఈసారి లఖ్నవూ బౌలర్లు బాధితులయ్యారు. -
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
హైదరాబాద్ ఓపెనర్ల పవర్ హిట్టింగ్ చూశాక.. లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా అభినందించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ను క్షణాల్లోనే తమ నుంచి లాగేసుకున్నారని పేర్కొన్నాడు. -
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో లఖ్నవూపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ గెలిచింది. -
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. -
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
సంక్షోభం వేళ చౌతాలాకు షాక్.. భాజపా గూటికి పార్టీ ఎమ్మెల్యేలు..!
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు