olympics: ఒలింపిక్స్ చరిత్రలో పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయిన మన అథ్లెట్లు!
టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒక స్వర్ణం సహా ఏడు పతకాలను భారత్ ఖాతాలో వేశారు. భారత్ అత్యధిక పతకాలు సాధించింది ఈ ఒలింపిక్స్లోనే. అయితే, మరికొంత మంది అథ్లెట్లు కూడా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసేలా కనిపించారు. కానీ, పతక పోరులో
ఇంటర్నెట్ డెస్క్: టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఒక స్వర్ణం సహా ఏడు పతకాలను భారత్ ఖాతాలో వేశారు. భారత్ అత్యధిక పతకాలు సాధించింది ఈ ఒలింపిక్స్లోనే. అయితే, మరికొంత మంది అథ్లెట్లు కూడా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసేలా కనిపించారు. కానీ, కాంస్య పోరులో నాలుగోస్థానానికి పరిమితమై ఆ పతకాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడే కాదు.. ఒలింపిక్స్లో చరిత్రలో ఇలా నాలుగోస్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన భారత అథ్లెట్లు కొంతమంది ఉన్నారు. వారెవరంటే..!
రణధీర్ షిండేస్ - ఆంట్వెర్ప్(బెల్జియం),1920
ఆంట్వెర్ప్-1920 ఒలింపిక్స్లో భారతీయులు తొలిసారి పాల్గొన్నారు. ముగ్గురు అథ్లెట్లు, ఇద్దరు రెజ్లర్లు భారత్కు ప్రాతినిథ్యం వహించారు. ఈ ఒలింపిక్స్లో భారత్కు పతకాలు రాలేదు. కానీ.. రెజ్లర్ రణ్ధీర్ షిండేస్ స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సెమీఫైనల్కు చేరుకున్న రణధీర్ ఆ మ్యాచ్లో ఓడిపోయారు. కాంస్యం కోసం జరిగిన పోటీలోనూ వెనుకబడటంతో రణధీర్ నాలుగోస్థానంలో నిలిచి.. తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు.
ఫుట్బాల్ జట్టు - మెల్బోర్న్(ఆస్ట్రేలియా),1956
ఇప్పటికీ అంతర్జాతీయ ఫుట్బాల్లో భారత్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. కానీ, 1956 ఒలింపిక్స్లో మన భారత ఫుట్బాల్ జట్టు దుమ్మురేపింది. లీగ్ మ్యాచ్లను దాటి క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. అయితే, సెమీస్లో యూగోస్లేవియా జట్టు భారత్పై ఆధిపత్యం చలాయించడంతో ఓటమి తప్పలేదు. కాంస్య కోసం ఆడిన మ్యాచ్లోనూ బల్గేరియా చేతిలో ఓడిపోవడంతో భారత్ నాలుగుస్థానానికి పరిమితమైంది. కాంస్య పతకం ఆశలు చెదిరిపోయాయి.
మిల్కా సింగ్ - రోమ్ (ఇటలీ),1960
మిల్కాసింగ్.. ఒలింపిక్స్లో పతకం సాధించకపోయినా భారతీయుల మనసు గెలిచిన అథ్లెట్. 1960లో నిర్వహించిన ఒలింపిక్స్లో మిల్కాసింగ్ పురుషుల 400 మీటర్ల స్ప్రింట్లో పాల్గొన్నారు. అయితే, ఇందులో మిల్కాసింగ్ నలుగోస్థానంలో నిలిచారు. కేవలం 0.1 సెకన్ తేడాతో కాంస్య పతకం దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయారు. పరుగును మిల్కాసింగ్ 45.6 సెకన్లలో పూర్తిచేయగా.. అతడి కంటే ముందుగా 45.5 సెకన్లలో పరుగు పూర్తి చేసి దక్షిణాఫ్రికా అథ్లెట్ మాల్కోమ్ స్పెన్స్ కాంస్యం గెలుచుకున్నాడు.
మహిళల హాకీ జట్టు - మాస్కో(రష్యా),1980
భారత మహిళల హాకీ జట్టు 1980 ఒలింపిక్స్లో తొలిసారి అడుగుపెట్టింది. పోలాండ్, ఆస్ట్రియాతో జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన భారత జట్టు.. ఆ తర్వాత ఓటములు చవిచూసింది. ఫలితంగా జింబాబ్వే స్వర్ణం సాధించగా.. చెకోస్లేవియా రజతం, ఆతిథ్య దేశం సోవియట్ యూనియన్(రష్యా) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. భారత్ నాలుగో స్థానానికి పరిమితం కావడంతో పతకం చేజారింది.
పి.టి. ఉష - లాస్ ఏంజెల్స్(అమెరికా),1984
పరుగు పందెం అనగానే గుర్తొచ్చే పేరు పి.టి. ఉష. 1984లో జరిగిన ఒలింపిక్స్లో మహిళల 400 మీటర్స్ హర్డల్స్లో ఆమె.. తృటిలో పతకాన్ని కోల్పోయింది. పరుగును 55.42 సెకన్లలో పూర్తి చేసిన పి.టి. ఉష.. సెకనులో వందోవంతు తేడాతో వెనుకబడి నాలుగోస్థానంలో నిలిచింది. అలా కాంస్య పతకం మిస్ అయింది.
కుంజరాణి దేవి - ఏథేన్స్(గ్రీస్),2004
వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి 2004 ఒలింపిక్స్లో 48కిలోల వెయిట్ లిఫ్టింగ్లో పాల్గొంది. పోటీలో మొత్తంగా ఆమె 190 కిలోలను ఎత్తింది. అయితే, ఆమె కంటే థాయ్లాండ్కు చెందిన ఆరీ విరత్తవార్న్ కేవలం 10 కిలోలు అదనంగా ఎత్తి మూడోస్థానంలో నిలిచింది. కుంజరాణికి నాలుగుస్థానం రావడంతో కాంస్య పతకం వచ్చే అవకాశం చేజారింది.
లియాండర్ పేస్, మహేశ్ భూపతి - ఏథేన్స్(గ్రీస్),2004
2004 ఒలింపిక్స్లో భారత టెన్నిస్ స్టార్ ఆటగాళ్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి కూడా తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నారు. టెన్నిస్ డబుల్స్లో వీరిద్దరు కలిసి పోటీపడ్డారు. తొలి మూడు రౌండ్లలో విజయం సాధించి.. సెమీఫైనల్ వరకు దూసుకెళ్లారు. ఆ మ్యాచ్లో ఓడిపోవడంతో కాంస్యం కోసం క్రోయేషియాతో తలపడ్డారు. ఎంత శ్రమపడ్డా.. ఓటమి తప్పలేదు. దీంతో క్రోయేషియా మూడోస్థానంతో కాంస్యం గెలుచుకోగా.. భారత్ నాలుగుస్థానంలో నిలిచింది.
జోయ్దీప్ కర్మాకర్ - లండన్(యూకే), 2012
జోయ్దీప్ కర్మాకర్.. భారత షూటర్. 2012 ఒలింపిక్స్లో పురుషుల 50మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో పోటీ పడ్డాడు. ఫైనల్ పోటీలో 104.1 స్కోరు చేసి మొత్తంగా 699.1 స్కోరుతో ఫైనల్ ఫలితాల్లో నాలుగు స్థానంలో నిలిచాడు.
సానియా మీర్జా, రోహన్ బోపన్న - రియో,(బ్రెజిల్), 2016
2016 ఒలింపిక్స్లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పతకం సాధిస్తారని అందరూ భావించారు. కానీ, నిరాశే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వీరిద్దరూ సెమీఫైనల్ వరకు వెళ్లి ఓటమిపాలయ్యారు. కాంస్య పతక పోరులోనూ అదే ఫలితం రావడంతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు.
అభినవ్ బింద్రా - రియో(బ్రెజిల్), 2016
బీజింగ్ ఒలింపిక్స్-2008లో షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన అభినవ్ బింద్రా.. లండన్ ఒలింపిక్స్-2012లో 16 స్థానంలో నిలిచాడు. రియో ఒలింపిక్స్-2016లోనూ పొల్గొన్న అభినవ్ బింద్రా.. మంచి ప్రదర్శనే చేశాడు. కానీ, ఫైనల్ స్కోరులో నాలుగుస్థానంలో నిలవడంతో తృటిలో కాంస్య పతకం చేజారింది.
దీపా కర్మాకర్ - రియో(బ్రెజిల్), 2016
దీపా కర్మాకర్.. 2016 ఒలింపిక్స్ వరకు ఎవరికి పెద్దగా ఆమె పేరు తెలియదు. కానీ, ఒలింపిక్స్ వేదికపై జిమ్నాస్టిక్స్లో ఆమె ప్రదర్శన చూసి యావత్ భారత దేశం అభినందించింది. జిమ్నాస్టిక్స్లో సాహసోపేతమైన ‘ప్రొడునొవా వాల్ట్’ ఫీట్ చేసి ఔరా అనిపించింది. కానీ, ఫైనల్ ఫలితాల్లో ఆమె నాలుగోస్థానానికి పరిమితమైంది. అయినా, దీపా కర్మాకర్కు ప్రధాని నుంచి.. సామాన్య పౌరుల వరకు అందరూ అండగా నిలిచారు.
మహిళల హాకీ జట్టు - టోక్యో(జపాన్), 2020
ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టుతోపాటు మహిళల జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. అయితే, సెమీస్లో ఆ జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైంది. ఆనంతరం రాణీ రామ్పాల్ జట్టు కాంస్య పతకం కోసం బ్రిటన్తో తలపడి.. అందులోనూ ఓటమిపాలైంది. అలా కాంస్య పతకాన్ని అందుకోలేపోయింది.
అదితి అశోక్ - టోక్యో(జపాన్), 2020
ఎవరూ ఊహించని రీతిలో భారత గోల్ఫర్ అదితి అశోక్ విశేషంగా రాణించింది. చివరి క్షణాల్లో ఒలింపిక్స్కు వెళ్లిన ఆమె అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాప్ ప్లేయర్లను కూడా వెనక్కినెడుతూ ఫైనల్ వరకూ చేరుకుంది. దాంతో పతకంపై ఆశలు పెంచిన అదితి దురదృష్టవశాత్తు నాలుగో స్థానానికి పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నా.. సంజూ శాంసన్ క్యాచ్ ఔట్పై మాత్రం చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్కు వెళితే ఏదైనా సాధ్యమేనని గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు. -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం లఖ్నవూ కెప్టెన్పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. అంతకుముందు కోల్కతా చేతిలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. -
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ పంజాబ్తో బెంగళూరు తలపడనుంది. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి మరోసారి మంచి ఇన్నింగ్స్ రావాలని అతడి అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను కాదని ముంబయి హార్దిక్ను కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు. -
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
తమ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి హైదరాబాద్ చేతిలో ఓటమిపాలు కావడం లఖ్నవూ ఫ్రాంచైజీ యజమానికి తీవ్ర అసహనం తెప్పించింది. దానిని కెప్టెన్ కేఎల్ రాహుల్పై చూపించడం నెట్టింట వైరల్గా మారింది. -
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
ముంబయి ఇండియన్స్లో హార్దిక్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఆటగాళ్లు తమ అభిప్రాయాలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చారు. -
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
గత మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోని హైదరాబాద్ ఓపెనర్లు మళ్లీ విజృంభించారు. ఈసారి లఖ్నవూ బౌలర్లు బాధితులయ్యారు. -
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
హైదరాబాద్ ఓపెనర్ల పవర్ హిట్టింగ్ చూశాక.. లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా అభినందించకుండా ఉండలేకపోయాడు. మ్యాచ్ను క్షణాల్లోనే తమ నుంచి లాగేసుకున్నారని పేర్కొన్నాడు. -
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో లఖ్నవూపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ గెలిచింది. -
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్
లఖ్నవూతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. -
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్నవూపై సన్రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?
-
‘గాడ్ ఫాదర్’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్ బయోపిక్లో నటించాలనుంది: సత్యదేవ్
-
భైంసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!