ODI WC 2023: ఐసీసీ అవార్డు కోసం బుమ్రా నామినేటెడ్.. పాక్ సెమీస్కి వచ్చినా ఏకపక్షమేనట!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) మరోసారి దాయాదుల పోరును చూస్తామా..? ఇప్పటికే భారత్ సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో నాకౌట్లో తలపడాల్సి ఉంటుంది. దాని కోసం పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ జరిగినా ఏకపక్షమే అవుతుందని మాజీ క్రికెటర్ జోస్యం చెప్పాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోసం టీమ్ఇండియా స్టార్పేసర్ నామినేట్ కావడం విశేషం. శ్రీలంకతో వివాదాస్పద నిర్ణయం తీసుకున్న బంగ్లా సారథి వరల్డ్ కప్ చివరి మ్యాచ్కు దూరమయ్యాడు. ఇలాంటి వరల్డ్ కప్ సంగతులు మీ కోసం..
సెమీస్కు పాక్ వస్తుంది.. మళ్లీ ఏకపక్ష మ్యాచ్ ఖాయం: కైఫ్
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టీమ్ఇండియా (16) ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచుల్లో గెలిచి ఊపుమీదుంది. వచ్చే ఆదివారం నెదర్లాండ్స్తో చివరి మ్యాచ్లో టీమ్ఇండియా తలపడనుంది. మరోవైపు నాలుగో స్థానం కోసం పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పాక్ కూడా నాలుగో స్థానంలో నిలిచి సెమీస్కు వస్తే భారత్తో తలపడాల్సి ఉంటుంది. ఇప్పటికే 8-0 రికార్డుతో టీమ్ఇండియా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ‘‘పాక్ సెమీస్కు చేరుకుంటుంది. కానీ, ఆ మ్యాచ్ కూడా ఏకపక్షమే అవుతుంది. గత చరిత్రను తెరిచి చూస్తే ఇదే అర్థమవుతుంది. భారత్ జట్టు వారిని సులువుగా ఓడించగలదు. ఇంగ్లాండ్పై భారీ విజయం సాధిస్తే తప్పకుండా పాక్ సెమీస్కు వచ్చే అవకాశ ఉంది. అయితే, నెట్రన్రేట్ను మరింత మెరుగుపర్చుకునేలా వారి గెలుపు ఉంటేనే ఇది సాధ్యం’’ అని కైఫ్ వ్యాఖ్యానించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఐసీసీ అవార్డు కోసం బుమ్రా
టీమ్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో వరల్డ్ కప్లో అదరగొట్టేస్తున్నాడు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అక్టోబర్ అవార్డు కోసం ముగ్గురు పేర్లు నామినేట్ అయ్యాయి. అందులో న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా ఈ రేసులో నిలిచారు. బుమ్రా ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు 15 వికెట్లు తీశాడు. పవర్ప్లే ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేశాడు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. కేవలం 230 పరుగులను రక్షించుకోవడంలో షమీతోపాటు బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో మూడు వికెట్లు తీశాడు.
చివరి మ్యాచ్కు షకిబ్ అల్ హసన్ దూరం
శ్రీలంకతో మ్యాచ్లో షకిబ్ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ కావడంలో షకిబ్ అప్పీలే ప్రధాన కారణం . అయితే, ఆ మ్యాచ్లో షకిబ్ తొలుత బౌలింగ్లో రెండు వికెట్లు తీయగా.. బ్యాటింగ్లోనూ విలువైన 82 పరుగులు సాధించి బంగ్లా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన బంగ్లా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత అవకాశాల కోసం తీవ్రంగా కష్టపడుతోంది. ఇలాంటి సమయంలో తన చివరి మ్యాచ్ను ఆస్ట్రేలియాతో నవంబర్ 11న బంగ్లా ఆడనుంది. కానీ, ఈ మ్యాచ్కు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ దూరమవుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చూపుడు వేలికి గాయం కావడం, ఎక్స్రేలోనూ ఫ్రాక్చర్ నిర్థరణ కావడంతో చివరి మ్యాచ్ ఆడడని బంగ్లా బోర్డు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్