IND vs ENG: జట్టుగా విఫలమయ్యామన్న రోహిత్.. ఐదో స్థానానికి పడిన భారత్
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో (IND vs ENG) భారత్కు ఇంగ్లాండ్ చేతిలో ఓటమి ఎదురైంది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా పరాజయం మాత్రం తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో (IND vs ENG) ఓడిపోవడంపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. నాలుగు రోజులపాటు సాగిన ఈ మ్యాచ్లో ఎక్కడ పొరపాటు జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని.. జట్టుగా విఫలమయ్యామని మాత్రమే చెప్పగలనని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఓలీ పోప్ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ దూరమైందని పేర్కొన్నాడు.
‘‘తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం సాధించాం. మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించామని భావించాం. కానీ, భారత పిచ్ పరిస్థితుల్లో విదేశీ ప్లేయర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడం చూశాం. ఓలీ పోప్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించడానికి ప్రధాన కారణం అతడే. మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గానే అమలు చేశారు. కానీ, వాటన్నింటినీ పోప్ పటాపంచలు చేస్తూ ఆడాడు. ఈ మ్యాచ్లో 230 పరుగుల లక్ష్యం ఛేదించగలమని భావించా. తొలుత పిచ్ నుంచి టర్నింగ్ భారీగా వస్తుందని ఊహించలేదు. కానీ, రెండో ఇన్నింగ్స్లో మేం బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. సిరాజ్ - బుమ్రా మ్యాచ్ను చివరి రోజుకు తీసుకెళ్తారని భావించా. చివరి రోజు 20 లేదా 30 పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఏదైనా సాధ్యమే. లోయర్ ఆర్డర్ చాలా పోరాడింది. టాప్ ఆర్డర్ నేర్చుకోవాల్సిందదే. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, మరికొన్నింటిని జారవిడుచుకున్నాం. సిరీస్లో ఇదే తొలి మ్యాచ్. ఓటమి నుంచి నేర్చుకుని మున్ముందు మ్యాచ్ల్లో రాణిస్తామనే నమ్మకం ఉంది’’ అని రోహిత్ తెలిపాడు.
కెప్టెన్గా ఎన్నో అద్భుత క్షణాలు: బెన్ స్టోక్స్
‘‘నేను కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్నా. చాలా అద్భుతమైన విజయాలను నమోదు చేస్తున్నాం. సారథిగా తొలిసారి భారత్కు వచ్చిన నాకు శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నేను మ్యాచ్ను ఎక్కువగా గమనిస్తూ ఉంటా. ప్రత్యర్థి కెప్టెన్ ఎలా ఫీల్డింగ్ను సెట్ చేస్తున్నాడు..? బౌలింగ్లో ఎలాంటి మార్పులు చేస్తున్నాడు? అనేది నిరంతరం చూస్తుంటా. రోహిత్ చాలా అద్భుతంగా ఫీల్డింగ్ సెటప్ పెట్టాడు. దాని నుంచి ఎంతో నేర్చుకున్నా. టామ్ హార్ట్లే అరంగేట్రంలోనే సూపర్ ప్రదర్శన చేశాడు. అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఎక్కువ ఓవర్లు ఇచ్చా. ఈ మ్యాచ్ విజయంలో మా బ్యాటర్ ఓలీ పోప్ కీలక పాత్ర పోషించాడు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉపఖండం పిచ్పై ఇంగ్లాండ్ బ్యాటర్ నుంచి వచ్చిన అద్భుత ఇన్నింగ్స్ల్లో ఇదే అత్యుత్తమం’’ అని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.
100 శాతం అద్భుత ఇన్నింగ్స్: ఓలీ పోప్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
‘‘భారత్లో విదేశీ బ్యాటర్లకు కఠిన సవాల్ తప్పదు. ఇలాంటి పిచ్పై భారీ శతకం చేయడం అద్భుతమనిపిస్తోంది. ఇదే అత్యుత్తమం. రెండో ఇన్నింగ్స్లో కొన్నిసార్లు అదృష్టం కూడా నాకు కలిసొచ్చింది. స్లిప్లో క్యాచ్ జారిపోయిన తర్వాత కాస్త స్థిమితపడ్డా. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ కాకుండా ఉండేందుకు దృష్టిసారించా. ఈ సిరీస్ కోసం నా టెక్నిక్స్లోనూ కొన్ని మార్పులు చేసుకున్నా. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లను ప్రయత్నించా’’ అని ఓలీ పోప్ తెలిపాడు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో..
ఇంగ్లాండ్పై ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ (43.33 శాతం) ఐదో స్థానానికి వెళ్లిపోయింది. ఈ టెస్టుకు ముందు రెండో ర్యాంక్లో ఉండేది. డే/నైట్ టెస్టులో విండీస్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియా (55) అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా (50 శాతం), న్యూజిలాండ్ (50 శాతం), బంగ్లాదేశ్ (50 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్