భూమి నీటిని చంద్రుడు కాజేస్తున్నాడా?
నీటి జాడలున్నాయి. అయినా సహారా ఎడారి కన్నా 100 రెట్లు అధికంగా పొడిగా ఉంటుంది. ఇంతటి చిత్రం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? చంద్రుడి మీద. జాబిల్లి మీద నీరు గురించి మనకు మొదట్నుంచీ ఆసక్తే. తొలితరం ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడి మీది మచ్చలను
నీటి జాడలున్నాయి. అయినా సహారా ఎడారి కన్నా 100 రెట్లు అధికంగా పొడిగా ఉంటుంది. ఇంతటి చిత్రం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? చంద్రుడి మీద. జాబిల్లి మీద నీరు గురించి మనకు మొదట్నుంచీ ఆసక్తే. తొలితరం ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడి మీది మచ్చలను సముద్రాలుగానే భావించేవారు. తర్వాత అక్కడ వాతావరణమే లేదని, ఉపరితలం మీద ఎక్కడైనా నీరుంటే అది వెంటనే ఆవిరైపోతుందని తేల్చారు. అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి మీద కాలుపెట్టి, అక్కడ్నుంచి తెచ్చిన నమూనాలను పరిశీలించినా నీటి ఆనవాళ్లేమీ కనిపించలేదు. అనంతరం జాబిల్లి ఖనిజాలను విశ్లేషించి శాశ్వతంగా చీకటిగా ఉండే భాగంలో మంచు ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. మన ఇస్రోకు చెందిన చంద్రయాన్-1, నాసాకు చెందిన కాసిని, డీప్ ఇంపాక్ట్ ప్రయోగాల్లో ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల రూపంలో తడి ఖనిజాలు ఉన్నట్టు బయటపడింది. చివరికి నాసాకు చెందిన సోఫియా ప్రయోగం అందించిన సమాచారాన్ని విశ్లేషించి చంద్రుడి మీద నీరుందని నిర్ధరించారు. నీటి అణువులు చంద్రుడి ధూళి రేణువుల్లో చిక్కుకొని ఉండచ్చని తేల్చారు. దీనికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. చంద్రుడి మీదున్న నీరంతా అక్కడిదే కాదని, కొంత నీరు భూ వాతావరణం నుంచి ‘కొల్లగొట్టిందే’నని యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్బ్యాంక్స్ (యూఏఎఫ్) శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొంటున్నారు.
భూఅయస్కాంతావరణంతో..
భూమి పై వాతావరణం నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంటాయి. ఇవి చంద్రుడి మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చన్నది యూఏఎఫ్ శాస్త్రవేత్తల భావన. ఈ నీరు చంద్రుడి ధ్రువాల వద్ద ఉపరితలం కింద 3,500 క్యూబిక్ కిలోమీటర్ల విస్తీర్ణంలో గడ్డకట్టి లేదా ద్రవరూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూమి అయస్కాంత గుణం ఉంటుంది కదా. దీని ప్రభావంతో నెలలో ఐదు రోజుల పాటు భూమి చుట్టూ బుడగ మాదిరిగా భూఅయస్కాంతావరణం ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వీచే సౌర గాలి నెట్టటం వల్ల ఇందులో కొంత భాగం చిట్లిపోతుంది. అప్పుడది భూమికి ఒక చివరన అంటుకొని తోకలాగా మారుతుంది. దీన్ని చంద్రుడు తాకినప్పుడు చిట్లిపోయిన భాగాల్లో కొన్ని తిరిగి అతుక్కుంటాయి. దీంతో భూ వాతావరణం నుంచి తప్పించుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు హఠాత్తుగా తిరిగి వెనక్కి వస్తుంటాయి. ఈ క్రమంలో అయాన్లు చంద్రుడి ఉపరితలం మీద పడతాయి. అంటే అప్పుడు చంద్రుడు హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్ల ముసురులో చిక్కుకొని ఉంటాడని అనుకోవచ్చు. చంద్రుడికి అయస్కాంతావరణం ఉండదు కాబట్టి ఈ అయాన్లు చంద్రుడి ఉపరితలంలోకి చొచ్చుకెళ్లి, మంచు రూపంలో స్థిరపడతాయని యూఏఎఫ్ భూభౌతిక శాస్త్రవేత్త గంథర్ క్లెటెట్చ్కా చెబుతున్నారు.
ఇతర కారణాలూ
చంద్రుడి మీద నీరు పోగుపడటానికి ఇదొక్కటే కారణం కాదు. సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చని కొన్ని భావనలు చెబుతున్నాయి. సౌరగాలులు కూడా నీటి వనరులుగా ఉపయోగపడి ఉండొచ్చు. సౌరగాలుల్లో ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు ఉంటాయి. ఇవి కలిసిపోయి నీటి అణువులుగా ఏర్పడి ఉండొచ్చు. ఎక్కడ్నుంచి వస్తేనేం? మొత్తమ్మీద చంద్రుడి మీద నీరుందనే విషయం స్పష్టమైంది. త్వరలో అక్కడ దక్షిణ ధ్రువం వద్ద ఆవాసాలు నిర్మించాలని భావిస్తున్న శాస్త్రవేత్తల బృందానికిది తీపి కబురే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు