స్థలం ఇవ్వలేదు.. అద్దె కట్టలేదు!
వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు.
అవస్థల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులు
పరిహారమూ పూర్తిగా అందలేదని ఆవేదన
ఈనాడు డిజిటల్, సిద్దిపేట
ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్థులకు కేటాయించబోయే స్థలంలో అసంపూర్తిగా ఉన్న సిమెంటు రోడ్డు పనులు
వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. సర్వం కోల్పోయినా తమ గోడు వినే నాథులే కరవయ్యారని బాధపడుతూ వారంతా కాలం వెళ్లదీస్తున్నారు.
జలాశయం నిర్మాణంతో ఎనిమిది పంచాయతీల పరిధిలో 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6,581 కుటుంబాలు ఉండగా, అందులో 2,500 కుటుంబాలకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధి సంగాపూర్లో 600 ఎకరాల్లో రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొండపాక మండలం ఎర్రవల్లి, సింగాటంలో మరికొందరికి స్థలాలు ఇచ్చారు. కట్టిన ఇంటికి బదులు.. స్థలం కావాలని కోరుకున్న వారికి గజ్వేల్ పరిధిలో 250 గజాల చొప్పున కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వాటిలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు అందజేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎవరి స్థలం ఎక్కడుందో ఇప్పటివరకూ చూపించలేదని బాధితులు వాపోతున్నారు.
ఎన్నాళ్లిలా
నిర్వాసితులు తాత్కాలికంగా ఉంటున్న రెండు పడక గదుల ఇళ్లు
ఇళ్లు లేని వారంతా తాత్కాలికంగా గజ్వేల్ పట్టణంలో పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. అవీ నిండిపోవడంతో, మిగిలిన వారిని అద్దె ఇళ్లలో ఉండేలా ఒప్పించారు. అద్దె కింద ఆరు నెలలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ‘‘మమ్మల్ని గ్రామంనుంచి తరలించే సమయంలో పదిహేను రోజుల్లో స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఆరు నెలలు గడిచినా కేటాయింపు మాటెత్తడం లేదు. మొత్తం 920 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. 450 కుటుంబాలకు అద్దె సొమ్ము కూడా ఇవ్వలేదు. వ్యవసాయాధారంగా జీవించిన మేమంతా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యాం. అద్దె సొమ్ము ఎలా చెల్లించగలం’ అని బాధితులంతా ఆవేదన వ్యక్తంచేశారు. పరిహారం ఆలస్యం అవుతోందనే వ్యధతో నాలుగు నెలల క్రితం రైతు బానోతు హన్మంతు చనిపోయాడని తెలిపారు.
కుటుంబ పోషణ భారమైంది
- ఎల్దండి నర్సింహారెడ్డి, ఏటిగడ్డ కిష్టాపూర్
ముంపులో 15 ఎకరాల సాగు భూమి కోల్పోయా. ఆరు నెలల నుంచి గజ్వేల్లో అద్దెకు ఉంటున్నా. ఇంటి స్థలం ఇవ్వలేదు. అద్దె సొమ్ము చెల్లించలేదు. నెలకు రూ.6 వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నా. ఇక్కడ పని దొరకక కుటుంబ పోషణ భారమవుతోంది.
పనిలేక ఇబ్బంది
-బండి యాదగిరి, ఏటిగడ్డ కిష్టాపూర్
తాత్కాలికంగా గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు పడక గదుల ఇంటిలో ఉంటున్నా. ఊరు ఉన్నపుడు మూడెకరాల్లో వ్యవసాయం చేసేవాడిని. ప్రస్తుతం ఏ పనీ లేదు. కనీసం స్థలమైనా త్వరగా కేటాయిస్తే ఇల్లు కట్టుకుని, ఏదో ఒక పని వెతుక్కుంటాం.
ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
- అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట
మల్లన్న సాగర్ జలాశయం నిర్వాసితులకు గ్రామాలవారీగా స్థలాలు కేటాయించాలని నిర్ణయించాం. వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. త్వరలో స్థల కేటాయింపులు పూర్తిచేస్తాం. నిర్వాసితులెవరూ ఆందోళన చెందొద్దు. త్వరలో అద్దె సొమ్ము కూడా చెల్లిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్