స్థలం ఇవ్వలేదు.. అద్దె కట్టలేదు!
వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు.
అవస్థల్లో మల్లన్నసాగర్ నిర్వాసితులు
పరిహారమూ పూర్తిగా అందలేదని ఆవేదన
ఈనాడు డిజిటల్, సిద్దిపేట
ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్థులకు కేటాయించబోయే స్థలంలో అసంపూర్తిగా ఉన్న సిమెంటు రోడ్డు పనులు
వందల కుటుంబాల త్యాగం ఫలితంగా మల్లన్న సాగర్ జలాశయం రూపుదిద్దుకుంది. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 10 టీఎంసీలు నింపారు. జలాశయం నిర్మాణానికి భూములు, ఇళ్లు ఇచ్చిన త్యాగధనులకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. సర్వం కోల్పోయినా తమ గోడు వినే నాథులే కరవయ్యారని బాధపడుతూ వారంతా కాలం వెళ్లదీస్తున్నారు.
జలాశయం నిర్మాణంతో ఎనిమిది పంచాయతీల పరిధిలో 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6,581 కుటుంబాలు ఉండగా, అందులో 2,500 కుటుంబాలకు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా పరిధి సంగాపూర్లో 600 ఎకరాల్లో రెండుపడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొండపాక మండలం ఎర్రవల్లి, సింగాటంలో మరికొందరికి స్థలాలు ఇచ్చారు. కట్టిన ఇంటికి బదులు.. స్థలం కావాలని కోరుకున్న వారికి గజ్వేల్ పరిధిలో 250 గజాల చొప్పున కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వాటిలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు అందజేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఎవరి స్థలం ఎక్కడుందో ఇప్పటివరకూ చూపించలేదని బాధితులు వాపోతున్నారు.
ఎన్నాళ్లిలా
నిర్వాసితులు తాత్కాలికంగా ఉంటున్న రెండు పడక గదుల ఇళ్లు
ఇళ్లు లేని వారంతా తాత్కాలికంగా గజ్వేల్ పట్టణంలో పేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉండేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. అవీ నిండిపోవడంతో, మిగిలిన వారిని అద్దె ఇళ్లలో ఉండేలా ఒప్పించారు. అద్దె కింద ఆరు నెలలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ‘‘మమ్మల్ని గ్రామంనుంచి తరలించే సమయంలో పదిహేను రోజుల్లో స్థలాలు కేటాయిస్తామని అధికారులు చెప్పారు. ఆరు నెలలు గడిచినా కేటాయింపు మాటెత్తడం లేదు. మొత్తం 920 కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. 450 కుటుంబాలకు అద్దె సొమ్ము కూడా ఇవ్వలేదు. వ్యవసాయాధారంగా జీవించిన మేమంతా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యాం. అద్దె సొమ్ము ఎలా చెల్లించగలం’ అని బాధితులంతా ఆవేదన వ్యక్తంచేశారు. పరిహారం ఆలస్యం అవుతోందనే వ్యధతో నాలుగు నెలల క్రితం రైతు బానోతు హన్మంతు చనిపోయాడని తెలిపారు.
కుటుంబ పోషణ భారమైంది
- ఎల్దండి నర్సింహారెడ్డి, ఏటిగడ్డ కిష్టాపూర్
ముంపులో 15 ఎకరాల సాగు భూమి కోల్పోయా. ఆరు నెలల నుంచి గజ్వేల్లో అద్దెకు ఉంటున్నా. ఇంటి స్థలం ఇవ్వలేదు. అద్దె సొమ్ము చెల్లించలేదు. నెలకు రూ.6 వేల చొప్పున కిరాయి చెల్లిస్తున్నా. ఇక్కడ పని దొరకక కుటుంబ పోషణ భారమవుతోంది.
పనిలేక ఇబ్బంది
-బండి యాదగిరి, ఏటిగడ్డ కిష్టాపూర్
తాత్కాలికంగా గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు పడక గదుల ఇంటిలో ఉంటున్నా. ఊరు ఉన్నపుడు మూడెకరాల్లో వ్యవసాయం చేసేవాడిని. ప్రస్తుతం ఏ పనీ లేదు. కనీసం స్థలమైనా త్వరగా కేటాయిస్తే ఇల్లు కట్టుకుని, ఏదో ఒక పని వెతుక్కుంటాం.
ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం
- అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట
మల్లన్న సాగర్ జలాశయం నిర్వాసితులకు గ్రామాలవారీగా స్థలాలు కేటాయించాలని నిర్ణయించాం. వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. త్వరలో స్థల కేటాయింపులు పూర్తిచేస్తాం. నిర్వాసితులెవరూ ఆందోళన చెందొద్దు. త్వరలో అద్దె సొమ్ము కూడా చెల్లిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!