Omicron: వ్యాక్సినేషన్ రేటు తగ్గడమే కారణమా?
కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల
టీకాలు విస్తృతంగా ఇవ్వకపోవడం వల్లే ఒమిక్రాన్ పుట్టి ఉండొచ్చని నిపుణుల విశ్లేషణ
దిల్లీ: కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలోనే కొత్త వేరియంట్లు ఉద్భవిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తర్వాత టీకా పంపిణీ, వైరస్ మ్యూటేషన్లు, కొత్త వైరస్పై వ్యాక్సిన్ల సమర్థత అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉండటం వల్లే కొత్త రకాలు పుట్టుకొస్తుండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కొత్త వేరియంట్లు ఎలా పుడతాయంటే?
రోగి శరీరంలో వైరస్ తన ప్రతిరూపాలను తయారుచేసుకుంటుంది. సాధారణంగానే ఈ ప్రతిరూపాల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించేందుకు కొన్ని సార్స్ వైరస్లు మాత్రమే అవసరమవుతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తే రోగికి ప్రమాదకరంగా మారుతుంది. రోగి శరీరంలో లక్షల కొద్దీ వైరస్ కణాలు పుట్టుకొస్తాయి. ఇందులో కొన్ని కణాలు రోగి శరీరం నుంచి (శ్వాసకోశం ద్వారా) బయటకు వచ్చి ఇతరులకు వ్యాపిస్తాయి. వైరస్ కణాలు ఉద్భవించే క్రమంలో ఆర్ఎన్ఏ పునరుత్పత్తి సరిగా జరగదు. దీంతో వైరస్ నిర్మాణంలో తప్పులు దొర్లుతాయి. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి.
కొన్ని వేరియంట్లు ఎందుకు ప్రమాదకరం?
వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు కొన్ని వేరియంట్లు కణాల్లోకి చొరబడే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. మరికొన్ని రకాలు మాత్రం పునరుత్పత్తిలో మెరుగ్గా ఉంటాయి. కొన్ని ‘ఫిట్టర్’ వేరియంట్లు ప్రధాన వైరస్గా మారుతుంటాయి. ఎవరికైనా సార్స్-కోవ్-2 సోకితే.. ఆ రోగి శరీరం మరింత చురుకైన వేరియంట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.
వేగంగా వ్యాపిస్తుందా?
ఒమిక్రాన్ వేరియంట్కు సంబంధించిన స్పైక్ ప్రోటీన్లో 32 ఉత్పరివర్తనలు ఉన్నట్లు వెల్లడైంది. వ్యాప్తిని అధికం చేసే మ్యూటేషన్లతో పాటు రోగనిరోధకతను ఏమార్చే మార్పులూ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది.
వైరస్ మార్పులపై వ్యాక్సిన్ల ప్రభావం?
డెల్టా సహా సార్స్-కోవ్-2పై ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయి. ఈ టీకాలు వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను లక్ష్యంగా చేసుకుంటాయి. ఆ ప్రొటీన్ సాధారణంగా ఎక్కువ మార్పులకు లోను కాదు. కాబట్టి వైరస్పై టీకాలు ఇంకా పనిచేస్తున్నాయి. అయితే, బీటా, గామా, లాంబ్డా, మ్యూ వంటి కొన్ని వేరియంట్లు వ్యాక్సిన్ ఇమ్యూనిటీని కొంతమేర ఎదుర్కొంటున్నాయి. రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించకపోవడమే ఇందుకు కారణం. అయితే, రోగనిరోధకతను ఎదిరించే వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా పరిమితంగానే ఉన్నాయి.
తక్కువ వ్యాక్సినేషన్ రేటు కారణమా?
టీకా కవరేజీకి, సార్స్-కోవ్-2 వేరియంట్లు పుట్టుకురావడానికి మధ్య ఉన్న సంబంధంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే వ్యాక్సినేషన్ విస్తృతి తక్కువగా ఉంటే నిర్దిష్ట ప్రాంతంలో వైరస్ వ్యాప్తి పెరిగి కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం పెరుగుతుంది. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు 24 శాతం మాత్రమే ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. వ్యాక్సిన్ సమర్థత సుదీర్ఘకాలం ఉండాలి.
దక్షిణాఫ్రికాలో తక్కువ వ్యాక్సిన్ కవరేజీ సైతం ఒమిక్రాన్ పుట్టుకకు కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన ఒమిక్రాన్ ఆవిర్భావానికి వైరస్లో ఇదివరకు సంభవించిన మార్పులు సైతం కారణమై ఉండొచ్చు. మ్యూటేషన్లు అధికంగా ఉన్న వేరియంట్లు ఇదివరకూ పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదు. వ్యాక్సిన్ కవరేజీని పెంచడం ద్వారా వైరస్లో మార్పులను పరిమితం చేయవచ్చు. టీకా విస్తృతి అనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్