Statue of Equality: శోభాయమానం... సమారోహం
భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ
ఏడుగురు జీయర్ స్వాముల పర్యవేక్షణలో క్రతువు
నేటి నుంచి సహస్ర కుండ శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం
ఈనాడు, హైదరాబాద్: భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జై శ్రీమన్నారాయణ నినాదాలు.. అష్టాక్షరీ మంత్రోచ్చారణలతో ముచ్చింతల్ క్షేత్రం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడింది. రామానుజులు అవతరించి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తలపెట్టిన ఈ వేడుకలకు హైదరాబాద్ శివారు సరికొత్త రూపు సంతరించుకుంది. 12 రోజులపాటు వైభవోపేతంగా జరిగే ఉత్సవాలకు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ చేశారు. అహోబిల జీయర్స్వామి, దేవనాథ జీయర్స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్స్వామి, అష్టాక్షరీ సంపత్కుమార జీయర్స్వామి, శ్రీరామచంద్ర జీయర్స్వామి, ముక్తినాథ జీయర్స్వామి కూడా ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.
తొలిరోజు ఉదయం శోభాయాత్రతో నాంది పలికి.. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ మొదలైంది. పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో కలిపి ఘటిక, పాలికలో ఉంచి క్రతువు చేపట్టారు. యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులకు చినజీయర్స్వామి ఆధ్వర్యంలో కంకణధారణ, దీక్షా వస్త్రాల సమర్పణ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల నుంచి 5 వేల మంది రుత్వికులు విచ్చేశారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే యజ్ఞాలకు యాగశాలలను తోరణాలతో అలంకరించి సిద్ధం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్ రామేశ్వరరావు దంపతులు, సమతామూర్తి ప్రాజెక్టు అధ్యక్షుడు వనజా భాస్కరరావు, జీవా ప్రాజెక్టు అధ్యక్షుడు చలిమెడ లక్ష్మణరావు, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఛైర్మన్ గోకరాజు గంగరాజు హాజరయ్యారు.
కనుల పండువగా శోభాయాత్ర
తొలుత ఉదయం అశ్వవాహనారూఢుడైన సీతారామచంద్రస్వామిని ఊరేగించారు. బాలస్వాములు ముందు నడుస్తుండగా.. శంఖనాదాలు మార్మోగగా.. జీయర్స్వాముల మార్గదర్శనంలో విశేషంగా అలంకరించిన వాహనంలో పెరుమాళ్ శోభాయాత్ర కనులపండువగా సాగింది. వేలాది మంది రుత్వికులు, వేదపండితులు, వాలంటీర్లు వెంట నడవగా.. మహిళల కోలాటాలు, జయజయధ్వానాలతో ఆశ్రమం నుంచి యాగశాల వరకు గంటసేపు ఊరేగింపు కొనసాగింది. రాములవారిని యాగశాలకు తీసుకువచ్చాక పూజలు చేశారు. అనంతరం హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా వాస్తుహోమాలను ప్రారంభించారు.
సాధారణ భక్తులకూ అవకాశం
ఉత్సవాల్లో సాధారణ భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 రోజులపాటు కొనసాగనున్న యాగాలు, ప్రవచనాలకు వారు హాజరు కావచ్చన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని ఆవిష్కరించిన తర్వాతే వారిని అనుమతిస్తామన్నారు. ఈ నెల 13 తర్వాత 108 దివ్య క్షేత్రాలు, స్వర్ణమూర్తిని దర్శనం చేసుకునే సౌకర్యం అందరికీ కల్పిస్తామని పేర్కొన్నారు. వేడుకల్లో తొలి రోజు 50 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు.
వెర్రితలలు వేస్తున్న వాస్తు విధానం: చినజీయర్స్వామి
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, శంషాబాద్: ప్రస్తుత సమయంలో వాస్తు అనేది వెర్రితలలు వేస్తోందని, దీనివల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని త్రిదండి రామానుజ చినజీయర్స్వామి అన్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా వాస్తుపూజ, హోమాలు, అంకురార్పణల విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ‘అసురుల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారు. పురాణాల ప్రకారం భృగుమహర్షి స్వేదం నుంచి పుట్టిన అసురుడు. మనుషులు, దేవతలను అల్లకల్లోలం చేసేవాడు. ఆయనను అణచివేసేందుకు దేవతలు ప్రయత్నించారు. ఆ సమయంలో అసురుడు బ్రహ్మను ప్రార్థించగా.. ఇల్లు కట్టుకునేవారు.. ఏదైనా అభివృద్ధి చేసేవారిపై నీ దృష్టి ప్రభావం ఉంటుంది. నిన్ను శాంతింపజేస్తే బాధ తగ్గి సుఖం కలుగుతుందని వరం ఇచ్చార’ని వివరించారు. దాంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా వాస్తు పురుషుడికి శాంతి పూజలు, హోమం చేయడం ఆచారంగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అహోబిల జీయర్ స్వామి తదితరులు యాగాలు, పుణ్యక్షేత్రాలు తదితర విశిష్టతలను వివరించారు.
నేటి కార్యక్రమాలు ఇలా..
యాగశాలలో ఈ నెల 14 వరకు హోమాలు ఉంటాయి. ముందుగా మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉద్భవించే అగ్నిహోత్రంతో 1,035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. 4న అష్టాక్షరీ మహామంత్ర సామూహిక పారాయణం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్