Statue of Equality: శోభాయమానం... సమారోహం
భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా
రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఘనంగా అంకురార్పణ
ఏడుగురు జీయర్ స్వాముల పర్యవేక్షణలో క్రతువు
నేటి నుంచి సహస్ర కుండ శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం
ఈనాడు, హైదరాబాద్: భక్తుల కోలాటాలు.. కళాకారుల వాద్య విన్యాసాలు.. జీయర్ స్వాముల మంగళ వచనాల నడుమ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జై శ్రీమన్నారాయణ నినాదాలు.. అష్టాక్షరీ మంత్రోచ్చారణలతో ముచ్చింతల్ క్షేత్రం ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడింది. రామానుజులు అవతరించి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తలపెట్టిన ఈ వేడుకలకు హైదరాబాద్ శివారు సరికొత్త రూపు సంతరించుకుంది. 12 రోజులపాటు వైభవోపేతంగా జరిగే ఉత్సవాలకు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ చేశారు. అహోబిల జీయర్స్వామి, దేవనాథ జీయర్స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్స్వామి, అష్టాక్షరీ సంపత్కుమార జీయర్స్వామి, శ్రీరామచంద్ర జీయర్స్వామి, ముక్తినాథ జీయర్స్వామి కూడా ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నారు.
తొలిరోజు ఉదయం శోభాయాత్రతో నాంది పలికి.. సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ మొదలైంది. పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో కలిపి ఘటిక, పాలికలో ఉంచి క్రతువు చేపట్టారు. యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులకు చినజీయర్స్వామి ఆధ్వర్యంలో కంకణధారణ, దీక్షా వస్త్రాల సమర్పణ చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల నుంచి 5 వేల మంది రుత్వికులు విచ్చేశారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే యజ్ఞాలకు యాగశాలలను తోరణాలతో అలంకరించి సిద్ధం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్ రామేశ్వరరావు దంపతులు, సమతామూర్తి ప్రాజెక్టు అధ్యక్షుడు వనజా భాస్కరరావు, జీవా ప్రాజెక్టు అధ్యక్షుడు చలిమెడ లక్ష్మణరావు, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఛైర్మన్ గోకరాజు గంగరాజు హాజరయ్యారు.
కనుల పండువగా శోభాయాత్ర
తొలుత ఉదయం అశ్వవాహనారూఢుడైన సీతారామచంద్రస్వామిని ఊరేగించారు. బాలస్వాములు ముందు నడుస్తుండగా.. శంఖనాదాలు మార్మోగగా.. జీయర్స్వాముల మార్గదర్శనంలో విశేషంగా అలంకరించిన వాహనంలో పెరుమాళ్ శోభాయాత్ర కనులపండువగా సాగింది. వేలాది మంది రుత్వికులు, వేదపండితులు, వాలంటీర్లు వెంట నడవగా.. మహిళల కోలాటాలు, జయజయధ్వానాలతో ఆశ్రమం నుంచి యాగశాల వరకు గంటసేపు ఊరేగింపు కొనసాగింది. రాములవారిని యాగశాలకు తీసుకువచ్చాక పూజలు చేశారు. అనంతరం హనుమంతుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. మధ్యాహ్నం శాస్త్రోక్తంగా వాస్తుహోమాలను ప్రారంభించారు.
సాధారణ భక్తులకూ అవకాశం
ఉత్సవాల్లో సాధారణ భక్తులను అనుమతిస్తామని నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 రోజులపాటు కొనసాగనున్న యాగాలు, ప్రవచనాలకు వారు హాజరు కావచ్చన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని ఆవిష్కరించిన తర్వాతే వారిని అనుమతిస్తామన్నారు. ఈ నెల 13 తర్వాత 108 దివ్య క్షేత్రాలు, స్వర్ణమూర్తిని దర్శనం చేసుకునే సౌకర్యం అందరికీ కల్పిస్తామని పేర్కొన్నారు. వేడుకల్లో తొలి రోజు 50 వేల మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు.
వెర్రితలలు వేస్తున్న వాస్తు విధానం: చినజీయర్స్వామి
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, శంషాబాద్: ప్రస్తుత సమయంలో వాస్తు అనేది వెర్రితలలు వేస్తోందని, దీనివల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని త్రిదండి రామానుజ చినజీయర్స్వామి అన్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా వాస్తుపూజ, హోమాలు, అంకురార్పణల విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. ‘అసురుల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారు. పురాణాల ప్రకారం భృగుమహర్షి స్వేదం నుంచి పుట్టిన అసురుడు. మనుషులు, దేవతలను అల్లకల్లోలం చేసేవాడు. ఆయనను అణచివేసేందుకు దేవతలు ప్రయత్నించారు. ఆ సమయంలో అసురుడు బ్రహ్మను ప్రార్థించగా.. ఇల్లు కట్టుకునేవారు.. ఏదైనా అభివృద్ధి చేసేవారిపై నీ దృష్టి ప్రభావం ఉంటుంది. నిన్ను శాంతింపజేస్తే బాధ తగ్గి సుఖం కలుగుతుందని వరం ఇచ్చార’ని వివరించారు. దాంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా వాస్తు పురుషుడికి శాంతి పూజలు, హోమం చేయడం ఆచారంగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అహోబిల జీయర్ స్వామి తదితరులు యాగాలు, పుణ్యక్షేత్రాలు తదితర విశిష్టతలను వివరించారు.
నేటి కార్యక్రమాలు ఇలా..
యాగశాలలో ఈ నెల 14 వరకు హోమాలు ఉంటాయి. ముందుగా మంత్రపూర్వకంగా అగ్నిని ఆవాహన చేస్తారు. శమీ, రావి కర్రలను మథనం చేయగా ఉద్భవించే అగ్నిహోత్రంతో 1,035 కుండాలను వెలిగించి హోమాలు ప్రారంభిస్తారు. ఇష్టిశాలల వద్ద దుష్ట నివారణకు శ్రీసుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీవాసుదేవేష్టి చేస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి. 4న అష్టాక్షరీ మహామంత్ర సామూహిక పారాయణం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!